నిజంగానే అవంటే నాకు భయం...ట్రోల్ చేయడం దారుణం

First Published Oct 1, 2020, 7:52 AM IST

హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ని నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. కోవిడ్ టెస్టుల సమయంలో పాయల్ చిన్న పిల్ల మాదిరి ఏడవగా, ఆమె అతి చేస్తుందని విమర్శిస్తున్నారు. నెటిజన్స్ విమర్శలకు పాయల్ ఇది దారుణం అని స్పందించారు. 

సెలిబ్రిటీలు ఏ చిన్న పొరపాటు చేసిన ట్రోల్ చేయడానికి నెటిజెన్స్ రెడీగా ఉంటాడు. సోషల్ మీడియా ద్వారా ఓ ఆటాడేస్తారు. నెటిజెన్స్ చేసే ఈ సోషల్ మీడియా ట్రోల్ల్స్ సదరు సెలెబ్రిటీలను ఇబ్బంది పెట్టిన సందర్భాలు అనేకం.
undefined
తాజాగా పాయల్ రాజ్ పుత్ఓ విషయంలో నెటిజెన్స్ కి దొరికి పోయింది. ఇటీవల ఓ షూటింగ్ లో పాయల్ పాల్గొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలోభద్రతానియమాల రీత్యా షూటింగ్ లో పాల్గొన్నఅందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు.
undefined
ఇక పాయల్ రాజ్ పుత్ సైతం కోవిడ్ పరీక్షల కోసం శాంపిల్స్ ఇవ్వడం జరిగింది. వైద్య సిబ్బంది పాయల్ ముక్కునుండి శాంపిల్స్ సేకరిస్తున్న సమయంలో ఆమె గట్టిగా ఏడ్చేశారు. చిన్న పిల్ల మాదిరి ఏడ్చేశారు.
undefined
జస్ట్ శ్వాబ్ శాంపిల్స్ ఇవ్వడానికి పాయల్ చేసిన రాద్దాంతం చూసిన నెటిజెన్స్ ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అందులో ఏడ్చే అంత కష్టం ఏముంది. పాయల్ కొంచెం అతి చేశారని ఆమెను విమర్శించడం జరిగింది.
undefined
నెటిజెన్స్ట్రోల్ల్స్ కి పాయల్ స్పందించారు. నిజంగా నాకు డాక్టర్స్, మెడిసిన్, సూదులు అంటే భయం అని, అందుకే ఏడ్చాను అన్నారు. వాస్తవంగా నేను ఎంతో భయపడగా దానినిఎగతాళి చేయడందారుణం అని తన ఆవేదన వ్యక్తం చేశారు.
undefined
ప్రస్తుతం తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్న పాయల్, తమిళంలో ఓ కామెడీ హారర్ లో నటిస్తున్నారు. ఆర్ ఎక్స్ 100 తరువాత ఆ స్థాయి హిట్ పాయల్ ఖాతాలో పడలేదు.
undefined
click me!