నువ్వు వర్జినేనా...? శృతి హాసన్ కు నెటిజన్ సూటి ప్రశ్న, దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన స్టార్ హీరోయిన్

First Published Mar 17, 2023, 7:37 AM IST

శ్రుతి హాసన్ కు వింత అనుభవం ఎదురయ్యింది. ఎప్పుడూ సోషల్ మీడియలో ఫ్యాన్స్ కు అందుబాటులో ఉండే ఈ బ్యూటీ.. లైవ్ చాట్ ద్వారా ఫ్యాన్స్ తో మాట్లాడుతుంది. ఈసందర్భంగా ఆమెకు వింత ప్రశ్న ఎదుయ్యింది. 

అప్పుడప్పుడు  సోషల్ మీడియాలో నెటిజన్స్ తో లైవ్ చాట్ చేస్తుంటుంది హీరోయిన్ శృతి హాసన్. అలానే  తాజాగా తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో లైవ్ నిర్వహించింది. అది కూడా తన  బాయ్ ఫ్రెండ్  తో కలిసి లైవ్ చాటింగ్ లో పాల్గొంది శృతిహాసన్. ఈ ఆన్ లైన్ చాటింగ్ లో.. తన ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు జబాబులు చెపుతూవస్తోంది బ్యూటీ. అయితే ఇందులో కొన్ని వింత ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి ఆమెకు. శ్రుతి హాసన్ షాక్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అడిగారు  నెటిజన్లు. అందులో కోన్ని ప్రశ్నలు ఆమెను ఇబ్బంది పెట్టాయి. 

శృతిహాసన్ తో చాట్ చేస్తూ.. ఓ అభిమాని ఈ విధంగా అడిగాడు నేను మీతో సహజీవనం చేయాలనుకుంటున్నాను.. ఈ ప్రశ్నకు బదులిచ్చిన శ్రుతి హాసన్.. నో అని చెప్పేసింది. ఇవే కాదు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు  ఆమె కూలు గా సమాధానం చెప్పింది. ఇక మరో నెటిజన్ చాట్ చేస్తూ.. మీరు వర్జినేనా.. అని అడిగేశాడు. ఇక దాంతో శృతి హాసన్ కు కోపం ఆగలేదు.
 

తిక్కరేగడంతో ..  ఆనెటిజన్ కు బుర్రతిరిగిపోయేలా సమాధానం చెప్పింది బ్యూటీ. అయితే ఇక్కడ అతను చేసిన చిన్న పొరపాటు  శృతిహాసన్ కి దొరికిపోయేలా చేసింది. ఆ నెటిజన్ వర్జిన్ స్పెల్లింగ్ తప్పురాయడంతో ముందు నువ్వు వర్జిన్ స్పెల్లింగ్ సరిగా రాయడం నేర్చుకో.. అంటూ ఘాటుగా సమాధానం చెప్పింది. అయితే నెటిజన్లు మాత్రం.. అతనిపై ఫైర్ అయ్యావు కాని.. అతని ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పలేదు అంటూ శృతీని ట్రోల్ చేస్తున్నారు. 

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది శృతీ హాసన్.  చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఏజ్ పెరిగినా ఛాన్స్ లు మాత్రం బాగానే కొట్టేస్తుంది. ముఖ్యంగా సీనియర్ హీరోలకు ఓన్లీ ఆప్షన్ గా మారిపోయింది శృతి హాసన్. రీసెంట్ గా చిరంజీవి, బాలకృష్ణ సరసన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాల్లో నటించి మెప్పించింది బ్యూటీ. అంతే కాదు బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుంది. 

ప్రస్తుతం ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ సలార్ సినిమాలో నటిస్తోంది శృతి హాసన్. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్.. తనసోంత ఇమేజ్ తో ఎదిగింది. నటన విషయంలో.. గ్లామర్ విషయంలో తనకు తానేసాటి అని నిరూపించుకుంది బ్యూటీ. 

అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్.. ఓ మై ఫ్రెండ్, 3, సెవెంత్ సెన్స్ వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తుంది. 

click me!