ట్విన్స్ కి జన్మనిచ్చిన నయనతార, విఘ్నేష్‌ జంట.. నాలుగు నెలల్లోనే గుడ్‌ న్యూస్‌ చెప్పడంతో షాక్‌లో అభిమానం లోకం

First Published Oct 9, 2022, 7:34 PM IST

కోలీవుడ్ స్టార్ కపుల్ విఘ్నేష్ శివన్ - నయనతార తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. వారి జీవితంలోకి ట్విన్ బేబీ బాయ్స్ కు స్వాగతం పలికారు. ఇద్దరు మగబిడ్డలకు జన్మనివ్వడం పట్ల ఈ జంట సంతోషం వ్యక్తం చేస్తోంది.
 

కోలీవుడ్ స్టార్ కపుల్ విఘ్నేష్ శివన్ - నయనతార ఎప్పటి నుంచో ప్రేమాయణం కొనసాగించి ఈ ఏడాది జూన్ 9న తమిళనాడులో అంగరంగ  వైభవంగా వివాహాం చేసుకున్నారు. వీరి వివాహా  వేడుకకు సినీ తారలతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరైన విషయం తెలిసిందే. 
 

పెళ్లైనప్పటి నుంచి స్టార్ కపుల్ విదేశాల్లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరితో మరొకరు సమయం గడుపుతూ తీపి జ్ఘాపకాలను క్రియేట్ చేసుకుంటున్నారు. మరోవైపు వీరిద్దరికి సంబంధించిన అప్డేట్స్ ను కూడా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటేనే ఉన్నారు.

తాజాగా విక్కీనయన్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. దర్శకుడు, నయనతారా భర్త తెలిపిన సమాచారం ప్రకారం..  నయనతారా - విఘ్నేష్ శివన్ కు ఇద్దరు మగ బిడ్డలు జన్మించారని తెలిపారు. ఇద్దరూ కవలేనంటూ విఘ్నేష్ తాజాగా పోస్ట్ లో పేర్కొన్నారు. 
ఈ సందర్భంగా విఘ్నేష్ షేర్ చేసిన  పోస్ట్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

ట్విట్టర్ ద్వారా అభిమానులతో విఘ్నేష్ శివన్ ఈ శుభవార్తను పంచుకున్నారు. ‘నయనతారా, నేను తల్లిదండ్రులయ్యాం. ఇద్దరు కవలలైన మగబిడ్డలకు జన్మనివ్వడం సంతోషంగా ఉంది. మా ప్రార్థనలు, మా పూర్వీకుల ఆశీర్వాదాలు తోడై మాకు ఇద్దరు శిశువుల రూపంలో కవలలు వచ్చారు. వారికి మీ అందరి ఆశీస్సులు కావాలి’ అంటూ అభిమానులు,  నెటిజన్లను కోరారు. 

పుట్టిన రోజులైన అయ్యిందో లేదో.. అప్పుడే పిల్లలకు పేర్లు కూడా పెట్టారు  స్టార్ కపుల్. ఇద్దరు మగ శిశువులు కావడంతో వారికి ఉయిర్ (Uyir), ఉలగం (Ulagam) అంటూ నామకరణం కూడా చేశారు. ఈ గుడ్ న్యూస్ చెబుతూ విఘ్నేశ్ శివన్ పోస్ట్ చేసిన ఫొటో కూడా  అభిమానులను సంతోష పరుస్తోంది. ఇద్దరు శిశువుల పాదాలను నయన  తారా, శివన్ ముద్దాడుతూ మురిసిపోవడం విశేషం. 
 

అయితే నయనతార - విఘ్నేశ్ శివన్ పెళ్లై నేటికి సరిగ్గా నాలుగు నెలలు  మాత్రమే పూర్తైయింది. ఈలోగానే పిల్లలు  పుట్టారంటూ ఊహించని విధంగా స్టార్ కపుల్ ఫ్యాన్స్ కు ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కోణంలోనూ నెటిజన్లు, అభిమానుల్లో సందేహాలు  రేకెత్తున్నాయి. మరోవైపు విఘ్నేశ్ శివన్ కూడా పిల్లలు ఎలా జన్మినిచ్చారనేది చెప్పకపోవడం గమనార్హం.

కాగా, నయనతార - విఘ్నేశ్ శివన్ తమ పిల్లలను సరోగసి, లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ ద్వారా కలిగారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇటీవల కాలంలో నయనతారా ఎప్పుడూ కూడా తన బేబీబంప్ ను కానీ, ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేయకపోవడం పట్ల ఇదే నిజమని భావిస్తున్నారు. అసలు విషయం ఏంటనది ఇక  స్టార్ కపులే రివీల్ చేయాలి. ఏదైమైనా విక్కీనయన్ జీవితంలోకి ఇద్దరు  పిల్లలకు రావడం పట్ల అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

click me!