Intinti Gruhalakshmi: కూతురిని చూసి ఎమోషనల్ అయిన నందు.. ప్రియని గదిలో బంధించిన రాజ్యలక్ష్మి?

Published : Apr 14, 2023, 09:08 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఏప్రిల్ 14వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.  

PREV
16
Intinti Gruhalakshmi: కూతురిని చూసి ఎమోషనల్ అయిన నందు.. ప్రియని గదిలో బంధించిన రాజ్యలక్ష్మి?

ఈరోజు ఎపిసోడ్ లో విక్రమ్ కోపంతో మాట్లాడుతూ నేను మనసున్న మనిషిని, చెప్పే మాటకి కట్టుబడే మనిషిని అనగా అప్పుడు బసవయ్య విక్రమ్ ని మరింత రెచ్చగొడుతూ ఈ ప్రపంచంలో కన్నతల్లి ప్రేమ మీద పోటీపడేది భార్య ప్రేమ మాత్రమే అని అంటాడు. ఇంతకుముందే చెప్పాను ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను నా జీవితంలోకి ఎవరు వచ్చినా అమ్మ స్థానం తర్వాతే అని ఆవేశపడే మాట ఇస్తాడు విక్రమ్. నాకు అమ్మ మాట తర్వాతే ఏదైనా అని గట్టిగా అరిచి చెబుతాడు. ఆ మాటలకు రాజ్యలక్ష్మి  సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు అందరూ కలిసి విక్రమ్ ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ మాట్లాడుతారు.

26

తర్వాత విక్రమ్ వాళ్ళ తాతయ్య విక్రం కలసి వాళ్ళ నాన్న గదిలోకి వెళ్ళగా విక్రమ్ నీ పెళ్లి కొడుకుగా చూసి వాళ్ళ నాన్న సంతోష పడుతూ ఉంటాడు. అక్షింతలు చూపించి దీవించమని అడగగా చేతులు కదలకపోవడంతో విక్రం వలన తాత ఇద్దరు కన్నీళ్లు పెట్టుకుంటారు. మీ నాన్న చేతులతో దీవించలేడు మాటలతో దీవించలేడు మనసుతో మాత్రమే దీవిస్తాడు అనడంతో విక్రం కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు విక్రమ్ తండ్రి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటాడు. తల్లి లేని కొడుక్కి తల్లి కావాలని మీ నాన్న పెళ్లి చేసుకున్నాడు కాదు కాదు నేనే బలవంతంగా చేయించాను అని అంటాడు.
 

36

ఆ మహాతల్లి తండ్రీని కూడా దూరం చేసింది ఇదిగో ఇలా తయారు చేసింది అని అంటాడు విక్రమ్ వాళ్ళ తాతయ్య. అప్పుడు విక్రమ్ రాజ్యలక్ష్మిని గుడ్డిగా నమ్ముతూ అనవసరంగా మీరు అమ్మని అనుమానిస్తున్నారు అని అంటాడు. అప్పుడు విక్రమ్ కి ఏం చెప్పాలో తెలియక వాళ్ళ తాతయ్య నాన్న ఇద్దరు కన్నీళ్లు పెట్టుకుంటారు. అప్పుడు విక్రమ్ వాళ్ళ నాన్న పాదాల దగ్గర కూర్చొని నిజం చెప్తున్నాను నాన్న నన్ను సంజయ్ కంటే అమ్మ బాగా చూసుకుంటుంది దేవత లాంటి అమ్మని నాకు ఇచ్చారు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు విక్రమ్. అప్పుడు నువ్వు ఎప్పటికి నిజం తెలుసుకుంటావ్ విక్రం అనుకుంటూ అతని తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటాడు.
 

46

అప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు విక్రమ్ ని తలుచుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో తులసి ఎక్కడికి వచ్చి నా కూతురు ఇంకా రాలేదా అనడంతో అప్పుడే నీ కూతురు తయారవుతుందా అని అనసూయ అంటుంది. ఇంతలోనే దివ్య అక్కడికి రెడీ అయి రావడంతో అందరూ దివ్యవైపు అలాగే చూస్తూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు అందరూ సరదాగా దివ్య మీద సెటైర్స్ వేస్తూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు దివ్య సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడు దివ్య వెళ్ళి నందుని హత్తుకోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు.
 

56

అప్పుడు వాళ్ళిద్దరిని చూసి అందరూ బాధపడుతూ ఉంటారు. నా కూతురు ఇంత పెద్దది అయిపోయింది. త్వరలోనే ఒక ఇంటికి కోడలు కాబోతోంది తెలియకుండానే అమ్మ నాన్నలకు దూరం పెంచుకుంటుంది అని బాధగా మాట్లాడుతాడు నందు. అప్పుడు నందు తాను చేసిన తప్పుల గురించి అందరి ముందు ఒప్పుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంటుంది తులసి. అప్పుడు లాస్య అందర్నీ చూసి ఈ ఆనందాలు ముచ్చట్లు అన్ని కొన్నాళ్లే అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు సంజయ్ ప్రియా కాఫీ తీసుకొని రాగా ఎప్పుడూ అడిగితే ఎప్పుడు తీసుకొస్తున్నావు నాకు తాగే మూడు లేదు అవసరం లేదు తీసుకొని పో అని అంటాడు.
 

66

ప్రేమగా తీసుకొని వచ్చాను తాగు అనగా ఎప్పుడైతే నాతో బలవంతంగా తాళి కట్టించుకున్నావో అప్పుడే నీ మీద ప్రేమ చచ్చిపోయింది బలవంతంగా కాపురం చేయాల్సి వస్తోంది అని అంటాడు సంజయ్. ఇంతలోనే పనిమనిషి వచ్చి విక్రమ్ బాబు పిలుస్తున్నాడు అనగా సంజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మొబైల్ ఫోన్ అక్కడ ఉండడం చూసిన ప్రియ ఎలా అయినా దివ్య కి ఫోన్ చేసి అసలు విషయం చెప్పాలి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజ్యలక్ష్మి అక్కడికి వచ్చి ఫోన్ లాక్కొని ప్రియని ఒక గదిలో బంధిస్తుంది. ప్రియా కి సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది. చూస్తూ ఊరుకుంది కదా ఏం చేయలేదులే అనుకుంటున్నావా నా జోలికి వచ్చావంటే నేను నిన్ను చూపించాల్సి వస్తుంది పెళ్లికి అయిపోయే వరకు నోరు మూసుకుని పడి ఉండు లేదంటే నేనేంటో నాకు చూపిస్తాను అని అంటుంది.

click me!

Recommended Stories