బండ్ల గణేష్ పై నందమూరి ఫ్యాన్స్ ట్రోలింగ్.. కేసీఆర్, జూ.ఎన్టీఆర్ ఇద్దరి పేర్లు ప్రస్తావిస్తూ..

First Published Sep 4, 2022, 5:48 PM IST

బ్రహ్మాస్త్ర చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. గణేష్ ఉత్సవాల సందర్భంగా అనుమతి ఇవ్వడం కుదరదని పోలీసులు తేల్చేశారు. 

ముక్కుసూటిగా మాట్లాడే బండ్ల గణేష్ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటుంటాడు. కానీ ఆ వివాదాలకి బండ్ల గణేష్ అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. గబ్బర్ సింగ్ చిత్రంతో బల్క్ బస్టర్ ప్రొడ్యూసర్ గా మారిన బండ్ల గణేష్ అనేక హిట్ చిత్రాలు నిర్మించారు. ఇటీవల ప్రొడక్షన్ కి గణేష్ కొంత గ్యాప్ ఇచ్చారు. 

తాజాగా నందమూరి అభిమానులు బండ్ల గణేష్ ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఐ లవ్యూ కేసీఆర్ సర్ మీరు పులి అంటూ బండ్ల గణేష్ ఇటీవల ఓ ట్వీట్ చేశారు. అదే సమయంలో బ్రహ్మాస్త్ర చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. గణేష్ ఉత్సవాల సందర్భంగా అనుమతి ఇవ్వడం కుదరదని పోలీసులు తేల్చేశారు. 

కొన్నిరోజుల ముందు ఎన్టీఆర్.. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ ఐన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తెలంగాణాలో పరోక్షంగా బిజెపికి మద్దత్తు ఇస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఘాటుగా చర్చ జరిగింది. ఎన్టీఆర్ అమిత్ షా తో భేటీ కావడం వల్లే కేసీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అడ్డుకున్నారని నందమూరి అభిమానులు మండిపడ్డారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తారక్ ని చీఫ్ గేట్స్ గా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. 

ఫాన్స్ తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో బండ్ల గణేష్ కేసీఆర్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేయడం రభసగా మారింది. నందమూరి ఫ్యాన్స్ బండ్ల గణేష్ ని టార్గెట్ చేస్తూ తీవ్రంగా ట్రోల్ చేశారు. 

బండ్ల గణేష్ సింపుల్ ట్వీట్ తో ఈ వివాదానికి స్వస్తి చెప్పాడు. ఐ లవ్ కేసీఆర్.. ఐ లవ్ మై హీరో తారక్ అని మరో ట్వీట్ చేసారు. ఇకనైనా నందమూరి అభిమానులు శాంతిస్తారేమో చూడాలి. 

బండ్ల గణేష్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో బాద్షా, టెంపర్ లాంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. బండ్ల గణేష్ చివరగా డేగల బాబ్జి అనే చిత్రంలో నటించారు. నిర్మాతగా మరోసారి సత్తా చాటేందుకు బండ్ల గణేష్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

click me!