హీరోయిన్ కాళ్లు మొక్కిన బాలకృష్ణ, షాక్ లో అభిమానులు, నెటిజన్లు ఏమంటున్నారంటే?

Published : Mar 27, 2026, 09:02 AM IST

నటసింహం బాలకృష్ణ ఎవరికైనా రెండు చేతులెత్తి నమస్కారం పెడతారు కానీ.. ఎవరి కాళ్లకు మొక్కిన సందర్భాలు లేవు. కాని ఫస్ట్ టైమ్ ఓ హీరోయిన్ కాళ్లకు బాలయ్య మొక్కడం.. ప్రస్తుతం సంచలంగామారింది. ఇంతకీ విషయం ఏంటి?

PREV
15
నటసింహం బాలయ్య చాలా స్ట్రిక్ట్..

సాధారణంగా తన తల్లిదండ్రులకు తప్ప బాలకృష్ణ ఇతరుల కాళ్లకు నమస్కారం చేసిన సందర్భాలు లేవు. ఎప్పుడు అలా కనిపించలేదు కూడా. రాఖీ సందర్భంగా అక్కల కాళ్లకు నమస్కారం చేసిన వీడియో మాత్రం గతంలో వైరల్ అయ్యింది. కానీ బాలయ్య బాబు చిన్నా పెద్ద ఎవరు ఎదురుగా వచ్చినా.. చాలా వినయంగా..చిరునవ్వు నవ్వుతూ.. రెండు చేతులెత్తి నమస్కారం చేస్తుంటారు. ఎప్పుడూ చాలా సీరియస్ గా కనిపించే బాలకృష్ణ.. పరిచయం ఉంటేనే చనువుగా వ్యవహరిస్తుంటారు. అటువంటిది.. నటసింహం ఓ హీరోయిన్ కాళ్లకు నమస్కారం చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

25
హేమా మాలిని కాళ్లకు బాలయ్య నమస్కారం..

బాలయ్యతన కాళ్లకు నమస్కారం చేయడానికి వచ్చిన వారినీ కూడా తరచుగా మందలిస్తూ, “తల్లిదండ్రులకు తప్ప ఎవరి కాళ్లకు మొక్కకండి” అని చెప్పేవారని తెలిసిందే. అయితే తాజాగా, బాలీవుడ్ సీనియర్ నటి హేమ మాలిని కాళ్లకు బాలకృష్ణ నమస్కారం చేస్తున్న వీడియో బయటకు రావడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ వీడియోలో హేమ మాలిని ఆప్యాయంగా బాలకృష్ణను పలకరించడం, బాలకృష్ణ వినయంగా నిలబడి మాట్లాడటం కనిపిస్తోంది.

35
బాలకృష్ణకు అరుదైన పురస్కారం..

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం అత్యంత వైభవంగా ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ 2026’ వేడుకల్లో బాలకృష్ణకు జాతీయ స్థాయిలో ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ పురస్కారాన్ని అందజేశారు. 50 ఏళ్లకు పైగా సినిమా కెరీర్ ను కంప్లీట్ చేసుకుని, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నందమూరి బాలయ్య చేసిన కృషిని గుర్తిస్తూ జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఢిల్లీలోని ప్రఖ్యాత ‘భారత్ మండపం లో ఈ వెంట్‌ ఘనంగా జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా బాలయ్య ఈ పురస్కారం అందుకున్నారు.

45
నెటిజన్లు ఏమంటున్నారంటే?

కాగా ఈ వెంట్ లోనే బాలయ్య హేమా మాలిని కాళ్లకు నమస్కారం చేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. “మన కళ్లతో చూస్తున్నది నిజంగానే బాలయ్యనా?” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హేమ మాలిని విషయానికి వస్తే, ఆమె సౌత్ నుంచి బాలీవుడ్‌ కు వెళ్లి.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. ధర్మేంద్రతో కలిసి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది. అనంతరం ఆయనతో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. వారి పిల్లలు కూడా ఇండస్ట్రీలోనే రాణిస్తున్నారు.

55
బాలకృష్ణ వరుస విజయాలు..

వరుస విజయాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు బాలయ్య.. ఈమధ్య కాలంలో అఖండ సీక్వెల్ సినిమాతో పర్వాలేదనిపించాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా.. అనుకున్నంత హిట్ అవ్వలేదు. ప్రస్తుతం సినిమాలకు స్మాల్ బ్రేక్ తీసుకున్న బాలకృష్ణ.. త్వరలో మలినేని గోపీచంద్ తో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన వీర సింహరెడ్డి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుందన్న టాక్ వినిపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories