రజనీ మరో చిత్రం కూలీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. రజనీతో పాటు నాగార్జున, ఉపేంద్ర, సౌరబ్ శుక్లా, సత్యరాజ్, రెబా మోనికా జాన్ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జైలర్ 2లో నందమూరి బాలకృష్ణ నటించనున్నారని, దానికి రూ.50 కోట్ల పారితోషికం అడిగినట్లు సమాచారం.
బాలయ్య గెస్ట్ రోల్ కోసం అంత డిమాండ్ చేయడం షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే సోలో హీరోగానే బాలయ్య 40 కోట్ల వరకు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయినప్పటికీ జైలర్ 2 మేకర్స్ బాలయ్యకి అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక సమాచారం లేదు.