మన్మథుడు నాగార్జున, విక్టరీ వెంకటేష్ కలిసి ఇప్పటి వరకు ఒక్క మూవీలో కూడా నటించలేదు. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ బ్లాక్ బస్టర్ మూవీ మిస్ అయ్యింది.
వెంకటేష్, నాగార్జున కాంబినేషన్లో మిస్ అయిన మల్టీస్టారర్
మన్మథుడు నాగార్జున, విక్టరీ వెంకటేష్ వరుసకి బావబామ్మర్దులు. వెంకీ సిస్టర్ లక్ష్మిని నాగ్ మొదట పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. చైతూ వీరికే జన్మించారు. ఆ తర్వాత విడిపోయారు. అయితే వెంకీ, నాగార్జు కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. కాకపోతే `త్రిమూర్తులు` చిత్రంలో నాగ్ చిన్న గెస్ట్ రోల్ చేశారు. అది తప్ప వీరిద్దరి కాంబినేషన్లో మూవీస్ రాలేదు. అయితే ఈ ఇద్దరి కాంబోలో ఓ మూవీకి ప్లాన్ జరిగింది. నిర్మాత అన్ని ప్లాన్ చేశాడు. కానీ డైరెక్టర్ హ్యాండివ్వడంతో ఆశలన్నీ తలక్రిందులయ్యాయి. ఆ కథేంటో చూస్తే
25
మణిరత్నం దర్శకత్వంలో సూపర్ హిట్ అయిన `అగ్నినక్షత్రం`
తమిళంలో 1988లో `అగ్నినక్షత్రం` అనే మూవీ రూపొందింది. దీనికి మణిరత్నం దర్శకుడు. ప్రభు, కార్తీక్, అమల, నిరోషి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ఇద్దరు సవతి సోదరుల చుట్టూ తిరిగే కథ. వీరికి తండ్రి ఒక్కడే. ఫ్యామిలీలో కొన్ని హక్కులకు సంబంధించి ఇద్దరు అన్నదమ్ములు విభేదిస్తారు. గొడవలు పడతారు. అది ఆద్యంతం నాటకీయంగా సాగుతుంది. ఫ్యామిలీ, కమర్షియల్ ఎలిమెంట్లు, మంచి మాస్ మసాలా అంశాలు జోడించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తమిళంలో పెద్ద హిట్ అయ్యింది.
దీంతో ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు నిర్మాత సీఎల్ సరసారెడ్డి. తెలుగులో నాగార్జున, వెంకటేష్ హీరోలుగా సినిమా చేస్తే బాగుంటుందని భావించారు. ఈ హీరోలను కూడా ఈ రీమేక్కి ఒప్పించాడు. తానే నిర్మాతగా ఈ మూవీ నిర్మించాలనుకున్నారు సరసారెడ్డి. అయితే చివరి నిమిషంలో దర్శకుడు మణిరత్నం హ్యాండిచ్చాడు. తెలుగులో రీమేక్ చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. దీంతో చేసేదేం లేక ఆ మూవీని తెలుగులో `ఘర్షణ` పేరుతో డబ్ చేశారు.తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీ ఇక్కడ మామూలుగానే ఆడింది.
అలా మణిరత్నం కారణంగా నాగార్జున, వెంకటేష్ కాంబినేషన్లో రావాల్సిన మల్టీస్టారర్ మూవీ మిస్ అయ్యింది. ఆ తర్వాత ఎప్పుడూ అది సెట్ కాలేదు. మళ్లీ చాలా రోజుల తర్వాత `ప్రేమమ్` సినిమాలో నాగ్, వెంకీ గెస్ట్ రోల్ చేశారు. నాగచైతన్య హీరోగా ఈ మూవీ రూపొందిన విషయం తెలిసిందే. కాకపోతే ఇందులో నాగ్, వెంకీలకు కాంబినేషన్ సీన్లు లేవు. వేర్వేరు సందర్భాల్లో జస్ట్ అలా మెరుస్తారు. ఇదిలా ఉంటే `ఘర్షణ` పేరుతో తెలుగులో సినిమా చేశారు వెంకీ. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్మీనన్ దర్శకుడు. అసిన్ హీరోయిన్గా నటించింది. 2004లో విడుదలైన ఈ మూవీ యావరేజ్గానే ఆడింది.
55
త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ సినిమా
ఇక వెంకటేష్ ఇప్పుడు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న `మన శంకర్వరప్రసాద్ గారు` మూవీలో వెంకీ గెస్ట్ రోల్ చేయబోతున్నారట. చిన్న క్యామియోలో ఆయన మెరుస్తారని ఇప్పటికే అనిల్ రావిపూడి, వెంకీ స్పష్టం చేశారు. మరోవైపు నాగార్జున ఇటీవల `కుబేర`, `కూలీ` చిత్రాల్లో నటించారు. `కూలీ`లో నెగటివ్ రోల్ చేసి మెప్పించాడు. సోలో హీరోగా ఇంకా మరే మూవీని ప్రకటించలేదు. ప్రస్తుతం ఆయన `బిగ్ బాస్ తెలుగు 9`కి హోస్ట్ గా చేస్తున్నారు.