`వైల్డ్ డాగ్‌` యూఎస్‌ ప్రీమియర్స్ షో రివ్యూ.. నాగార్జున రిలాక్స్ అవుతాడా?

First Published Apr 2, 2021, 7:29 AM IST

వరుస పరాజయాల్లో ఉన్న నాగార్జున అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన చిత్రం `వైల్డ్ డాగ్‌`. ఇండియాలోనే బిగ్గెస్ట్ అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ బేస్డ్ చిత్రంగా వస్తోన్న ఈ సినిమా నేడు(ఏప్రిల్‌2)శుక్రవారం విడుదలవుతుంది. ఈ సందర్భంగా యూఎస్‌ ప్రీమియర్స్ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. 

నాగార్జున, దియా మీర్జా, సయామీ ఖేర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న `వైల్డ్ డాగ్‌` చిత్రానికి అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వం వహించారు. ఆయనకిది తొలి చిత్రం. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించి హిమాలయాల్లో యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించడం విశేషం. మరోవైపు ఎలాంటి పాటలు లేకుండా రూపొందిన చిత్రమిది. పూర్తి కథమీదే సాగుతుంది. మరి ఏమేరకు అలరిస్తుందో తెలుసుకుందాం. చాలా రోజుల తర్వాత నాగార్జున సినిమా ప్రీమియర్‌ షోస్‌ వేయడం, ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్స్ వేయడం విశేషం.
undefined
సినిమా కోసం నాగార్జున చాలా రిస్క్ తీసుకున్నాడు. ముఖ్యంగా ప్రమోషన్‌ మొత్తం తన భుజాలపై వేసుకున్నారు. ఇందులో బాగా తెలిసిన ఫేసెస్‌ లేకపోవడంతో ఆ భారం మొత్తం నాగ్‌పైనే పడింది. దీంతో ఆయన వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఏకంగా టీవీ షోస్‌లోనూ పాల్గొనడం వంటివి చేయడం విశేషం.
undefined
కథ పరంగా చూస్తే.. ఇది ప్రారంభం నుంచే అంటే టైటిల్‌ కార్డ్ నుంచే సీరియస్‌ మూడ్‌లోకి తీసుకెళ్తుంది. మన ఇండియాలో బాంబ్‌ బ్లాస్ట్ జరుగుతుంది. దీంతో ఉలిక్కి పడ్డ ఇండియన్‌ గవర్నమెంట్‌ ఈ కేసుని ఎన్‌ఐఏకి అప్పగిస్తుంది. ఇక వైల్డ్ డాగ్‌గా పాపులర్‌ అయిన విజయ్‌ వర్మ(నాగార్జున)కి ఎన్‌ఐఏ బృందానికి లీడ్‌గా వ్యవహరిస్తుంటాడు. మొదటి బ్లాస్ట్ జరిగిన పుణేలోని జాన్స్ బేకరీకి చేరుకుంటుంది. అనంతరం దేశ వ్యాప్తంగా వరుసగా బ్లాస్ట్ లు జరుగుతుంటాయి. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా టీమ్‌ నేపాల్‌ కి కూడా వెళ్లాల్సి వస్తుంది. మరి ఈ క్రమంలో ఎన్‌ఐఏ టీమ్‌ ఎలా వ్యవహరించింది. టెర్రరిస్ట్ లను పట్టుకునేందుకు ఏం ప్లాన్‌ చేసింది? చివరికి అసలైన టెర్రరిస్ట్ ని పట్టుకున్నారా? సినిమా ఎలాంటి సొల్యూషన్‌ ఇస్తుంది? అనేది మిగిలిన కథ.
undefined
సినిమా ప్రారంభం నుంచి కథలోకి తీసుకెళ్లారు డైరెక్టర్‌. ఎలాంటి ల్యాగ్‌ లేకుండా ఆడియెన్స్ కి గ్యాప్‌ ఇవ్వకుండా స్టోరీలో లీనం చేసే ప్రయత్నం చేశాడు. పుణెలో జరిగిన బాంబ్‌ బ్లాస్ట్ తోనే మరింత ఉత్కంఠ క్రియేట్‌ చేశారు. ఆద్యంతం ఎంగేజింగ్‌గా సినిమా సాగింది. నాగార్జున ఎన్‌ఐఏ(నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) లీడ్‌గా ఆయన ఎంట్రీ అదిరిపోయింది. ఫస్టాఫ్‌ వరకు కథ చాలా వరకు ఎలాంటి డీవియేషన్స్ లేకుండా సాగింది. ఆడియెన్స్ ని అలా కూర్చోబెడుతుందని తెలుస్తుంది. దాదాపు రియల్‌ ఇన్స్ డెన్స్ ని ప్రతిబింబిస్తుంది. ఆడియెన్స్ ని సీట్‌ ఎడ్జ్ లో కూర్చొబెడుతుంది. ఇంటర్వెల్‌ ఫైట్‌ సీన్‌, టెర్రరిస్ట్ తప్పించుకుని పారిపోవడం వంటి సన్నివేశాలు గూస్‌బమ్స్ తెప్పిస్తున్నాయి.
undefined
ఇక సెకండాఫ్‌లో నాగార్జున టీమ్‌ అనాధికారికంగా నేపాల్‌లో కోవర్ట్ ఆపరేషన్‌ నిర్వహించే సన్నివేశాలు సైతం ఎంగేజ్‌ చేస్తాయట. సయామీ ఖేర్‌ రా ఏజెంట్‌గా అబ్బురపరుస్తుందంటున్నారు. సెకండాఫ్‌ మరింత రక్తికట్టిందనే చెప్పాలి. చివరి 20 నిమిషాలు థ్రిల్లర్ జోన్‌లోకి వెళ్లిపోయింది. క్లైమాక్స్ లో ఎమోషనల్‌ సీన్స్‌ మరింతగా ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ వర్కౌట్‌ అయితే సినిమా బ్లాక్‌బస్టరే అనే టాక్‌ యూఎస్‌ ప్రీమియర్స్ నుంచి వినిపిస్తుంది.
undefined
నాగార్జున నెక్ట్స్ లెవల్‌ పర్‌ఫెర్మెన్స్ ఇచ్చారని తెలుస్తుంది. యాక్షన్‌ సీక్వెన్స్ అదిరిపోయాయట. సయామీ ఖేర్‌, అలీరాజా వంటి వారు కూడా బాగా చేశారని, సీన్స్ ని ఎలివేట్‌ చేయడంలో దోహదపడ్డారని అంటున్నారు. ఇక దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌ క్రిస్పీ స్టోరీ, స్క్రీన్‌ప్లే, మంచి బీజీఎం సినిమాకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అంటున్నారు. మొత్తంగా అన్ని వర్గాల నుంచి పాజిటివ్‌ రిపోర్ట్ వినిపిస్తుంది. అదే సమయంలో ఈ సినిమాతో నాగార్జున రిలాక్స్ అయిపోతాడని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
undefined
click me!