నాగార్జున ప్రస్తుతం `వైల్డ్ డాగ్` చిత్రంలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు సోల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. లాక్డౌన్ తర్వాత ఈ సినిమాప్రారంభించుకుని హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంది.
undefined
మరో షెడ్యూల్ కోసం హిమాలయాలకు వెళ్ళింది చిత్ర బృందం. 21 రోజుల పాటు సాగే షెడ్యూల్లో నాగార్జునతోపాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొంది. ఓ వైపు షూటింగ్ని,మరోవైపు హిమాలయాల ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు నాగార్జున.
undefined
తాజాగా ఈ షెడ్యూల్లో తన పార్ట్ షూటింగ్ పూర్తయ్యిందట. దీంతో తిరిగి వస్తున్నానని చెబుతూ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు నాగార్జున. ఇన్నాళ్ళు హిమాలయాలను ఎంజాయ్చేసిన నాగ్.. తిరిగి ఇంటికి ప్రయాణమయ్యాడు. అయితే అక్కడి నుంచి రావడం చాలా బాధగా ఉందట. మంచి టీమ్కి, హిమాలయాలను వదిలి రావడం బాధగా ఉందనిపేర్కొన్నారు.
undefined
ఈ సందర్భంగా టీమ్తో, హిమాలయాల లోకేషన్ ఫోటోలను పంచుకున్నారు. హిమాలయాల ప్రకృతి ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో నాగార్జునతోపాటుసయామిఖేర్, అలీ రేజా, మయాంక్, బిలాల్ వంటి వారున్నారు. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది.
undefined
ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం నాగ్ పంచుకున్న హిమాలయాల సాయంత్రం ఫోటో విశేషంగా ఆకట్టుకుంది. కింద హిమాలయ పర్వతాలు, పైన మేఘాలు మధ్యలోసూర్యకిరణాలు. ఈ ఫోటో విజువల్ వండర్లా ఉంది.
undefined
మరోవైపు ఆ మధ్య షూటింగ్లో భాగంగా రెండు ఫోటోలను పంచుకున్నారు నాగ్.
undefined
అందులో టీమ్తో కలిసి ఆపరేషన్ చేసేందుకు కదులుతున్న స్టిల్స్ ఆకట్టుకున్నాయి. మరోవైపు నాగార్జున `బిగ్బాస్4` కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
undefined