కోట్లిచ్చి సెలబ్రిటీలను పెళ్లిళ్లకు రమ్మంటున్నారు.. దుమారం రేపుతున్న నాగార్జున వ్యాఖ్యలు..

First Published Mar 5, 2024, 3:20 PM IST

ముఖేష్‌ అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్‌ పార్టీకి బాలీవుడ్‌ సెలబ్రిటీలు హాజరైన నేపథ్యంలో నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి. 

ఇండియన్‌ కుభేరుడు ముఖేష్‌ అంబానీ కొడుకు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుక ఇటీవల చాలా గ్రాండ్‌గా జరిగింది. గుజరాత్‌లోని హిస్టారికల్‌ ప్లేస్‌ జామ్‌ నగర్లో ఈ వేడుక జరిగింది. రాధికా మర్చంట్‌తో అనంత్‌ అంబానీ పెళ్లి జరగబోతుంది. ఈ మేరకు చాలా గ్రాండ్‌ స్కేల్‌లో ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు. అయితే దీనికి బాలీవుడ్‌ మొత్తం కదిలి వచ్చింది. అమితాబ్‌ బచ్చన్‌ ఫ్యామిలీ మినహాయిస్తే.. ఆల్మోస్ట్ అందరు సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు. 
 

అమీర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, సైఫ్‌ అలీ ఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, షాహిద్‌ కపూర్‌, రణ్‌బీర్‌ కపూర్‌, దీపికా పదుకొనె, అలియాభట్‌, కరీనా కపూర్‌ ఇలా అనేక సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ బాలీవుడ్‌ ఇండస్ట్రీ మొత్తం హాజరయ్యింది. ఇక తెలుగు నుంచి కేవలం రామ్‌ చరణ్‌ ఫ్యామిలీ మాత్రమే హాజరయ్యింది. చరణ్‌, ఉపాసన పాల్గొన్నారు. ధోనీ వంటి క్రికెటర్లు కూడా ఇందులో పాల్గొని సందడి చేయడం విశేషం. దాదాపు మూడు రోజులపాటు వీళ్లు సందడి చేశారు. 
 

mukesh ambani emotional

బాలీవుడ్‌ మొత్తం ఓ వ్యాపారవేత్త కుమారుడి ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌కి హాజరు కావడంతో అంతర్జాతీయ మీడియా అటెన్షన్‌ మొత్తం దీనిపైనే ఉంది. అంతర్జాతీయంగా ముఖేష్‌ అంబానీకి రావాల్సిన ఇమేజ్‌ వచ్చేసింది. అదే సమయంలో ఓ వ్యాపారవేత్త కుమారుడి పెళ్లికి సెలబ్రిటీలు మొత్తం వెళ్లడమేంటి, మూడు రోజులు స్పెండ్‌ చేయడమేంటి? ఆటాపాటలతో అలరించడమేంటి? అనే చర్చ మొదలైంది. ఇది చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కొందరు వ్యాపారవేత్తలు కోట్లు ఇచ్చి సెలబ్రిటీలను తమ పెళ్లిళ్లకి ఆహ్వానిస్తున్నారని, ఇది విచిత్రంగా ఉందని నాగ్‌ వెల్లడించారు. అయితే నాగార్జున ఈ కామెంట్స్ చాలా ఏళ్ల క్రితమే చేశాడు.  ముఖేష్‌ అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్‌కి ఇంత మంది స్టార్స్ పాల్గొన్న నేపథ్యంలో నాగ్‌ వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. `ఓపెన్‌ హార్ట్ వీత్‌ ఆర్కే`లో నాగార్జున మాట్లాడుతూ, `పెళ్లిళ్లకి డబ్బులిచ్చి తీసుకొస్తుంటే ఇంకా ఏం చెబుతాం. మా పెళ్లికి రండి మేం డబ్బులిస్తాం. తనకు కూడా ఇలాంటి ఆఫర్లు వచ్చాయని, కానీ వెళ్లలేదని తెలిపారు నాగ్‌. 
 

Nagarjuna-Amala

గెస్ట్ గా వచ్చి ఓ ఇరవై నిమిషాలు టైమ్‌ స్పెండ్‌ చేయాలట. కాసేపు ఎంటర్టైన్‌ చేయాలట. బాలీవుడ్‌ వాళ్లు వెళ్తుంటారని, వీరికి కోటి రూపాయల వరకు ఇస్తుంటారని తెలిపారు నాగార్జున. సుమారు పది పదిహేనేళ్ల క్రితం ఆయన ఈ విషయాన్ని తెలిపారు. కానీ ఇప్పుడు అదే జరుగుతుంది. తాజాగా ముఖేష్‌ అంబానీ కొడుకు పెళ్లికి కూడా బాలీవుడ్‌ సెలబ్రిటీలంతా వెళ్లడంతో వాళ్లు కోట్లు తీసుకుని ఆ పెళ్లికి వెళ్లి ఉంటారని అంటున్నారు. సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చ చేస్తున్నారు. 
 

ఇందులో తెలుగు హీరో రామ్‌చరణ్‌ కూడా ఉండటంతో ఇది మరింత రచ్చ అవుతుంది. దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాళ్లు పిలిచారు, వెళ్లడం, వెళ్లకపోవడం వీరిష్టం అంటున్నారు. మొత్తంగా నాగార్జున వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయి. అంబాని ఇంటి పెళ్లికి ముడిపెడుతూ ఈ వీడియోని వైరల్‌ చేస్తున్నారు. 

click me!