మిడిల్ ఫింగర్ టాపిక్ తీసి రచ్చ రచ్చ చేసిన నాగార్జున.. పాపం రా సన్నీ అంటూ?

First Published Oct 10, 2021, 8:54 AM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. రేటింగ్ కూడా మొదటి స్థానంలో నిలుస్తుంది.

బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. రేటింగ్ కూడా మొదటి స్థానంలో నిలుస్తుంది. ఇక నిన్నటితో ఎపిసోడ్ 35 పూర్తవ్వగా అందులో హైలెట్స్ ఏంటో చూద్దాం.
 

 నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వారం 9 మంది నామినేషన్ లో ఉన్నారు. ఇక నాగార్జున ఇంట్లో వాళ్లను కాసేపు పరిశీలించాడు. జైల్లో ఉన్న కాజల్ దగ్గరికి వెళ్లి జెస్సి హమీదా గురించి మాట్లాడుతాడు.
 

 సిరి, షణ్ముఖ్, జెస్సీ శ్రీరామ్ గురించి మాట్లాడుకుంటూ పార్షియాలిటి అనగానే చెయ్యి ఎత్తాను అని సిరి వాళ్ళతో డిస్కస్ చేస్తుంది. ఇక వాళ్లు కూడా దాని గురించే డిస్కస్ చేస్తారు.
 

 మరోవైపు రవితో మానస్ కాజల్ గురించి మాట్లాడగా ఆ మాటలు వెళ్లి తిరిగి కాజల్ తో డిస్కస్ చేసే సరికి కాజల్ కాస్త ఫీల్ అవుతుంది. ఇక ప్రియ, విశ్వ మధ్య కాస్త మాటల యుద్ధం జరుగుతోంది.
 

 నాగార్జున ఎంట్రీ ఇచ్చి ప్రతి ఒక్క కంటెస్టెంట్ ను లేపి  వారితో మాట్లాడాడు. శ్రీ రామ్ ని బిగ్ బాస్ టైటిల్ ముఖ్యమా, హమీదా ముఖ్యమా అనేసరికి శ్రీరామ్ బిగ్ బాస్ టైటిల్ అని చెబుతాడు.
 

 సిరిని తన క్యారెక్టర్ గురించి అడిగేసరికి సిరి సమాధానం చెప్పకుండా నవ్వుతూ స్పందిస్తుంది. ఇక సన్నీ ని పలుకరిస్తూ రాజువి కాలేకపోవడంతో బాధ అనిపించిందని అతను ఓటమిని పంచుకుంటాడు.
 

 ఇక కొండ పొలం సినిమా ప్రమోషన్ లో భాగంగా డైరెక్టర్ క్రిష్, హీరో వైష్ణవ్ తేజ్ వచ్చి ఇంట్లో వాళ్ళతో కాసేపు ముచ్చటిస్తారు. ఇక నాగార్జున వైష్ణవ తేజ్ ను పొగిడి కాసేపు వాళ్ళతో మాట్లాడతాడు.
 

 క్రిష్ లోబో, శ్వేత లను తన మాటలతో గట్టిగా కడిగి పారేస్తాడు. నాగార్జున కూడా డైరెక్టర్ క్రిష్, వైష్ణవ్ ముందు రవిని పిలిచి అవసరం లేని వాళ్లకు అడ్వైజలు ఇస్తావ్ ఎందుకు నీతులు చెప్తావ్ అని సీరియస్ అవగా రవి కూడా కాస్త మొరటుగా సమాధానం చెబుతాడు.
 

చివరికి నాగార్జున లోబో ను కాజల్ విషయంలో గట్టిగా ప్రశ్నించాడు. మిడిల్ ఫింగర్ చూపించావా అని అడిగేసరికి లోబో లేదని చెప్పడంతో నాగార్జున వీడియో చూపించాడు. అందులో వేలు ఎత్తినట్టుగా ఉండగా ఏ వేలు అనేది మాత్రం సరిగా కనిపించకపోయేసరికి నాగార్జున కూడా ఏమీ అనలేకపోయాడు.

click me!