బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించగా, అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం 85 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రిలీజ్ కి ముందే ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినప్పటికీ ఇది అద్భుతమైన ప్రేమ కథ అని డైరెక్టర్ చందూ ముండేటి అంటున్నారు.