కాగా నాగ చైతన్య(Naga Chaitanya), శోభిత గురించి వస్తున్న ఈ ఎఫైర్ రూమర్స్ వెనుక సమంత పిఆర్ టీం ఉన్నారని నాగ చైతన్య టీం ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సమంత, నాగ చైతన్య పిఆర్ టీమ్స్ పరస్పర ఆరోపణలు గురించి వివరిస్తూ ఓ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. ఈ కథనాన్ని ట్యాగ్ చేస్తూ సమంత ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో.. ఓ అమ్మాయి పై రూమర్స్ వస్తే అవి నిజాలు, అదే ఓ అబ్బాయిపై వస్తే మాత్రం కావాలని ఓ అమ్మాయి చేయిస్తున్న దుష్ప్రచారం. ఇకనైనా ఎదగండిరా బాబూ. తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనం ఫ్యామిలీ, కెరీర్ గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్లడమే ... అంటూ సమంత తన ట్వీట్ లో కామెంట్ చేశారు. సమంత ఏకంగా నాగ చైతన్య, తన గురించి రాసిన ఆర్టికల్ ట్యాగ్ చేసి ఈ కామెంట్స్ చేయడంతో ప్రత్యక్ష దాడికి దిగినట్లు అయ్యింది.