అక్కడ్నుంచి కలియుగం ఎంటరైనప్పుడు ఈ కథ ఎలా వెళ్తుందనేది పూర్తిగా ఊహాత్మకమైనది. క్రియేటివ్ ఇమాజినేషన్. కృష్ణుడి అవతారం తర్వాత దశావతారం కల్కి ఇప్పుడు మన కళియుగంలో ఎలా జరగబోతుంది. ఎలా జరగొచ్చు అనేదానిపై ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎవ్వరైనా రిలేట్ అయ్యేలా చేస్తే ఎలా ఉంటుందనేదానిపై ఈ కథ రాసుకున్నాను. నిజానికి ఇది అన్నింటికి క్లైమాక్స్. పురాణాల్లో మనం చదివిన ఎపిక్స్ కి అన్నింటికి ఇదొక క్లైమాక్స్ లాగా చేస్తే, కలి అనేవాడు ఒక్కో టైమ్లో ఒక్కో రూపంలో ఉంటాడనుకుంటే. రావణుడిలా ఒకసారి, దుర్యోధనుడిలా మరోసారి, ఇప్పుడు కళియుగంలో అల్టిమేట్ ఫైనల్ రూపం తీసుకుంటే. అతను ఎలా ఉంటాడు, ఎలా హీరో అవుతాడు. చీకటి, వెలుగు అనేది పెట్టుకుని రాసుకుంటే ఇది రాయడానికి ఐదేళ్లు పట్టింది. ఇలాంటి ఓ కొత్త సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని చూస్తే జనాలు ఎలా క్యూరియస్ అవుతారనేది ఇంట్రెస్టింగ్గా అనిపించింది` అని వెల్లడించారు నాగ్ అశ్విన్.