పరస్పరం దాడులు చేసుకుంటున్న క్రమంలో మనోజ్ జుల్ పల్లి ఫార్మ్ హౌస్ వద్ద ఒక 30 మంది బౌన్సర్స్ ని ఏర్పాటు చేసుకున్నాడు. మంచు విష్ణు ఒక 40 మందికి బౌన్సర్స్ ని నియమించుకుంటున్నాడు. విదేశాల నుండి హుటాహుటిన విష్ణు వచ్చారు. ఆయన మీడియాతో కూడా మాట్లాడాడు. మోహన్ బాబు ఇంటి నుండి మనోజ్ ని వెళ్ళగొట్టే ప్రయత్నం జరిగింది. అంతకు ముందు మనోజ్ పహాడీ షరీఫ్ సీఐ గురువారెడ్డిని కలిశాడు. తనతో పాటు మౌనికకు, కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు లో పేర్కొన్నారు. అయితే మోహన్ బాబు, విష్ణు పేర్లు ఆయన ఫిర్యాదులో చేర్చలేదు. పది మంది దుండగులు మా ఇంటిపై దాడి చేశారు. కిరణ్ రెడ్డి, విజయ్ రెడ్డి సీసీ టీవీ ఫుటేజ్, హార్డ్ డిస్కులు ఎత్తుకుపోయారు. వారిని నిలువరించే క్రమంలో నాకు గాయాలు అయ్యాయని, మనోజ్ కంప్లైంట్ చేశాడు.