ఇప్పుడు `జై హనుమాన్`తోపాటు మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ సినిమా చేయడంలో ప్రశాంత్ వర్మ బిజీగా ఉన్నారని అన్నారు. అలాగే ఈ మూవీ కోసం మోక్షజ్ఞ కూడా ప్రిపేర్ అవుతున్నారని, యాక్టింగ్ స్కూల్లో బిజీగా ఉన్నాడని చెప్పారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఈ గురువారమే ప్రారంభించాలనుకున్నారు. కానీ జరగలేదు. దీనితో సినిమా క్యాన్సిల్ అంటూ ప్రచారం స్టార్ట్ అయ్యింది.
ఈ నేపథ్యంలో దీనిపై బాలయ్య స్పందించారు. కొడుకు సినిమా ఈ రోజే(గురువారం) మొదలు పెట్టాల్సింది, కానీ మోక్షజ్ఞ అనారోగ్యంతో కుదరలేదు. వాతావరణం బాగా లేదు కదా, అందుకే కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేశాం. ఏదైనా మన మంచికే కదా అని చెప్పారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య ఈ విషయం వెల్లడించారు.