సౌందర్య 100 కోట్ల ఆస్తిని సొంతం చేసుకున్న టాలీవుడ్ సీనియర్ హీరో ఎవరో తెలుసా..?

Published : Dec 06, 2024, 09:48 PM IST

కెరీర్ మంచి ఫామ్ లో ఉండగా అకాలంగా మరణించింది అందాల నటి సౌందర్య. అంతే కాదు ఆమె కోట్లలో ఆస్తులు కూడా కూడబెట్టినట్టు తెలుస్తోంది. ఇంతకీ సౌందర్య ఆస్తిలో 100 కోట్ల ప్రాపర్టీ ఓ తెలుగు హీరో సొంతం అయ్యిందట ఎలానో తెలుసా..?

PREV
16
సౌందర్య 100 కోట్ల ఆస్తిని సొంతం చేసుకున్న టాలీవుడ్ సీనియర్ హీరో ఎవరో తెలుసా..?

సావిత్రి తరువాత తెలుగు పరిశ్రమకు దొరికిన ఆణిముత్యంలాంటి  హీరోయిన్ సౌందర్య.  హీరోయిన్ గా ఎంతో పేరు తెచ్చుకున్నఈమె తెలుగు, తమిళ, కన్నడ, హిందీ  భాషల్లో  ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన ఆమె నటించింది.

తెలుగులో ఆమెను సావిత్రిలానే ఆదరించేవారు. ఏమాత్రం ఎక్స పోజింగ్ లేకుండా.. వల్గర్ గా డ్రెస్ లు వేసుకోకుండా చాలా పద్దతిగా ఉంటూ స్టార్ డమ్ అందుకున్న ఏకైక హీరోయిన సౌందర్య. నాలుగు భాషల్లో ఎన్నో సినిమాలు చేసిన ఆమె కోట్లకు కోట్లు ఆస్తులు కూడా కూడబెట్టినట్టు తెలుస్తోంది. 

Also Read: ఆర్జీవికి కుక్క బిస్కెట్స్ వేసిన హీరోయిన్, రామ్ గోపాల్ వర్మ ని అవమానించిన స్టార్ ఎవరు..?

26

అందమైన చిరునవ్వుతో అభిమానులను ఆకర్షించిన నటి సౌందర్య. బెంగళూరుకు చెందిన ఆమె కన్నడ కుటుంబంలో పుట్టి పెరిగింది.  1972లో జన్మించిన సౌందర్య కన్నడ సినిమాల్లో నటిస్తూ.. టాలీవుడ్  అవకాశాలు సాధించింది. తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా వెలుగు వెలిగింది. సౌత్ ఇండస్ట్రీని ఏలిన నటి సౌందర్య. 

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె.. దక్షిణ భారత భాషలలో వెలుగు వెలిగింది.  90వ దశకంలో సౌత్ ఇండియన్ సినిమాకు స్టార్ హీరోలుగా ఉన్న  చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, మోహాన్ లాల్, వెంకటేష్,  నాగార్జున, లతో పాటు శ్రీకాంత్, జగపతిబాబులాంటి స్టార్స్ తో కూడా ప్యామిలీ మూవీస్ లో నటించి మెప్పించింది. 

Also Read: యంగ్ హీరోతో నిహారిక కొణిదెల పెళ్ళి, మెగా డాటర్ చేసుకోబోయేది ఎవరినో తెలుసా..?

36

ఇక రాజకీయాల్లోకి వెళ్ళిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అయితే ఆమె అప్పటికే కోట్లకు కోట్లు సంపాదించగా.. సౌందర్య ఆస్తిని ఆమె భర్త తీసుకుని.. రెండో పెళ్ళి చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు అతనిపై లీగర్ లో కేసు వేసి..సౌందర్య తల్లీ తండ్రులు ఆస్తిని మళ్లీ దక్కించుకున్నట్టు సమాచారం. 

Also Read: నాగచైతన్య - శోభిత తో పాటు 2024లో పెళ్లి చేసుకున్న 10 సినిమా సెలబ్రిటీ జంటలు

46

అంతే కాదు సౌందర్య చనిపోయే నాటికి ఆమె 3 నెలల గర్భవతి. చాలా చిన్న వయస్సులోనే ఎంతో స్టార్ డమ్ ను చూసిన ఆమె.. 27 ఏళ్ళ అతి చిన్న వయస్సులోనే మరణించడం అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. టాలీవుడ్ నుంచి సౌందర్య మరణం తట్టుకోలేక హీరోవెంకటేష్ , మోహన్ బాబులాంటి హీరోలు బోరున విలపించారు. 

 

56

ఇక సౌందర్య ఆస్తిలో భాగంగా..హైదరాబాద్ లోని శంషాబాద్ ఏరియాలో 6 ఎకరాల వరకూ కొన్నిందట సౌందర్య. వాటిని తన తల్లీ తండ్రుల పేరు మీద రాసిందట. అయితే ఇప్పుడు ఆ ఆస్తి కోట్ల విలువ చేస్తుంది. వందల కోట్లు ఉంటుంది. అయితే ఆశ్చర్య కరంగా  ఆ ఆస్తి ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ నటుడు మోహాన్ బాబు చేతుల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదేలా సాధ్యం  అని అనుమానం రావచ్చు. అసలేం జరిగిందంటే..ఝ 

66

సౌందర్య మరణం తరువాత ఆర్ధిక ఇబ్బందుల్లో పడిన ఆమె తల్లీ తండ్రులు ఇక్కడ ఉన్న భూమిని అమ్మారట. ఆ భూమిని మోహాన్ బాబు కొనుక్కున్నట్టు తెలుస్తోంది. ఆ ప్లేస్ లో భారీ స్థాయిలో ఆయన ఇల్లు కట్టుకున్నారు. మంచు టౌన్ షిప్ పేరుతో నిర్మించిన ఆ ఇంట్లోనే ఆయన ఉంటున్నారు. అయితే ఈ ప్లేస్ ను నిజంగా సౌందర్య ఫ్యామిలీ దగ్గర నుంచి ఆయన కొన్నారా లేదా అనేదానిపై క్లారిటీ లేదు కాని..ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ మాత్రం నడుస్తోంది. 
 

click me!

Recommended Stories