వివరాల్లోకి వెళితే.. నిజంగానే రాంచరణ్, సుకుమార్ కాంబోలో రెండవ చిత్ర షూటింగ్ ప్రారంభం అయినట్లు స్వయంగా క్రేజీ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ రివీల్ చేశారు. సుకుమార్, చరణ్ కాంబోలో ఇప్పటికే రంగస్థలం లాంటి బ్లాస్టింగ్ హిట్ వచ్చింది. ఆ తర్వాత సుకుమార్ బన్నీతో పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్ప చేపట్టారు. రాంచరణ్ కి ఉన్న కమిట్మెంట్స్ పూర్తయ్యాక సుకుమార్ దర్శకత్వంలో మరోసారి నటించాల్సి ఉంది.