మెగాస్టార్ చిరంజీవి ఉదయం లేవగానే చూసే ఫోటో ఎవరిదో తెలుసా..?

First Published Apr 4, 2024, 12:51 PM IST

మెగాస్టార్ చిరంజీవి ఉదయాన్ని లేవగానే చూసే ఫోటో ఎవరిదో తెలుసా..? రీసెంట్ గా వెల్లడైన విషయంలో నిజం ఎంత..? 
 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఎంతో మంది యంగ్ స్టార్స్ కు ఆయన ఆదర్శం.. స్వయంకృషితో ఎదిగిన చిరు జర్నీతో ఎంతోమందికి ఆదర్శం.  ఆయనలా ఎదగాలని ఆయన ఫోటోని నిత్యం చూస్తూ ఎంతోమంది స్ఫూర్తి పొందుతుంటారు. అయితే ఇంత ఎత్తుకు ఎదిగిన మెగాస్టార్ ఎవరి నుంచి స్పూర్తి పొందారో తెలుసా..? 

ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. మెగా సాంమ్రాజ్యాన్ని విస్తరించిన చిరంజీవి.. ఇండస్ట్రీలో కపూర్ ఫ్యామిలీ ని మించిపోయిన సినిమా కుటుంబంగా ఎదిగారు. ఆయన ఫ్యామిలీ నుంచి నలుగురు పాన్ ఇండియా స్టార్లు.. నలుగురు టాలీవుడ్ స్టార్లు.. నిర్మాణ సంస్థలు, అనేక రకాల బిజినెస్ లు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రత్యేక సినిమా ప్రపంచాన్ని సృష్టించారు చిరు. 
 

chiranjeevi

అటువంటి చిరంజీవి నటీనటులలో ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు... ఎవర్ని ఆరాధిస్తారు..? రీసెంట్ గా ఈ సీక్రెట్ ఓ కార్యక్రమంలో రివిల్ అయ్యింది. ఇంతకీ ఎవరు రివిల్ చేశారో తెలుసా..?  రీసెంట్ గా హైదరాబాద్ లో మహానటి సావిత్రి క్లాసిక్స్ బుక్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని బుక్ ని లాంచ్ చేసారు. 

chiranjeevi

ఈ కార్యక్రమంలో  సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి  కూడా పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. చిరంజీవిని మొదటిసారి కలుసుకున్న సందర్భంలో జరిగిన విషయాన్ని పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. నేను చిరు ఇంటికి వెళ్ళినప్పుడు.. చిరంజీవి కాలికి గాయం అయ్యి రెస్ట్ లో ఉన్నారు. కాని నేను వచ్చానని తెలుసుకుని మేడ మీద ఉన్నవారు కూడా కిందకువచ్చారు. 

 పైన రూమ్ లో నుంచి కర్ర సహాయంతో క్రిందకి వచ్చిన మెగాస్టార్..  విజయ చాముండేశ్వరికి ఎంతో మర్యాధ చేశారట. అలాగే ఆమెతో మాట్లాడుతూ.. నేను రోజు ఉదయం లేవగానే సావిత్రమ్మ ఫోటోనే చూస్తాను. నా బెడ్ ఎదురుగా అమ్మ ఫోటోనే ఉంటుంది అని చెప్పారట. అంతే కాదు అలా చెపితే నమ్ముతారో లేదో అని ఫోటో కూడా తెచ్చి చూపించారట.
 

ఈ విషయంతో మెగాస్టార్ చిరంజీవికి సావిత్రి అంటే ఎంత గౌరవం.. ఆమె ను ఎంతగా ఆరాధిస్తారో అందరికి తెలిసింది. అంతే కాదు.. మహనటి గురించి తెలియని ఈ తరం వారికి కూడా ఈ న్యూస్ తో  తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. 

chiranjeevi

మెగాస్టార్ లో నిజాయితీ అందరికి నచ్చుతుంది. ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. అందుకే సావిత్రమ్మ బుక్ లాంచ్ కు ఆయన సరైనవారు అని ముఖ్య అతిథిగా పిలిచాము అన్నారు విజయ ఛాముండేశ్వరి. ఇక ప్రస్తుతం చిరుకు సబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

click me!