కియారా అద్వానీ, సిద్దార్థ్ వివాహం.. గెస్ట్ లిస్టులో రాంచరణ్, ఇంకా ఎవరంటే..

First Published Feb 4, 2023, 1:19 PM IST

బాలీవుడ్ రొమాంటిక్ జోడి కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా ఫిబ్రవరి 6న వివాహం బంధంతో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. అప్పుడే వీరి పెళ్లి హంగామా మొదలయింది.

బాలీవుడ్ రొమాంటిక్ జోడి కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా ఫిబ్రవరి 6న వివాహం బంధంతో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. అప్పుడే వీరి పెళ్లి హంగామా మొదలయింది. పెళ్ళికి ముందు రొమాంటిక్ ఫోటో షూట్స్ తో ఈ జంట రచ్చ చేస్తున్నారు. 6వ తేదీన రాజస్థాన్ లోని జై సల్మేర్ ప్యాలెస్ లో వీరి వివాహ వేడుక వైభవంగా జరగనుంది. 

సిద్ధార్థ్, కియారా అద్వానీ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. త్వరలో జరగబోయే వివాహ వేడుకతో తమ రిలేషన్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళుతున్నారు. ఆల్రెడీ గెస్ట్ ల లిస్ట్ కూడా ప్రిపేర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కియారా పెళ్ళికి తన కోస్టార్ మెగాపవర్ స్టార్ రాంచరణ్ అతిథిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గెస్ట్ లిస్ట్ లో చరణ్ పేరు ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 

రాంచరణ్ తో పాటు కియారా, సిద్దార్థ్ కి సన్నిహితులైన బాలీవుడ్ ప్రముఖులు హాజరవుతారట. కరణ్ జోహార్, షాహిద్ కపూర్ మియా కపూర్ దంపతులు, వరుణ్ ధావన్, విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ దంపతులు, రకుల్ ప్రీత్ సింగ్.. జాకీ భగ్నానీ జోడి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వెరీ పేర్లు గెస్ట్ లిస్టులో ఉన్నాయట. 

వీరి వివాహం తర్వాత ముంబై, ఢిల్లీ నగరాల్లో రెండు రిసెప్షన్ పార్టీలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వివాహానికి హాజరుకానివారందరినీ రిసెప్షన్ కి ఆహ్వానించనున్నారట. రాంచరణ్, కియారా జంటగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఆల్రెడీ వీరిద్దరూ వినయ విధేయ రామలో నటించారు. కియారా అద్వానీ బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. ముఖ్యంగా తెలుగులో ఆమెకి మంచి అవకాశాలు వస్తున్నాయి. మహేష్ సరసన భరత్ అనే నేనులో కూడా నటించింది. 

ఇదిలా ఉండగా కియారా వివాహానికి హాజరయ్యే అతిథుల కోసం ఆల్రెడీ 80 రూములు బుక్ చేసినట్లు తెలుస్తోంది. 100 మంది వరకు అతిథులు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

click me!