మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో నటిస్తున్నాడు. 1970, 80 దశకంలో స్టువర్టు పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా.. రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. టైగర్ నాగేశ్వర రావు చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. వంశీ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.