మహేష్, హృతిక్ కాంబినేషన్లో మిస్ అయిన మూవీ ఏంటో కాదు `రామాయణ్`. ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న మైథలాజికల్ చిత్రమిది.
రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యష్, సన్నీ డియోల్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందుతుంది. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ గ్లింప్స్ విడుదల చేశారు.
ఇందులో రాముడిగా రణ్ బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యష్ నటించారు. హనుమంతుడిగా సన్నీ డియోల్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది.