ఇందులో మహేష్ (Mahesh Letter) చెబుతూ, `ప్రముఖ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ వంటి ప్రముఖ సంస్థలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్, అచంట రామ్, అచంట గోలు సంయుక్తంగా నిర్మిస్తున్న `సర్కారు వారి పాట` షూటింగ్ పూర్తయి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 12 ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో `సరేగమ` కంపెనీ ద్వారా మార్కెట్లో విడుదలై, రేటింగ్లో సంచలనం సృష్టిస్తోంది. ఎన్నో అంచనాలతో వస్తోన్న `సర్కారు వారి పాట` చిత్రాన్ని థియేటర్లలోనే చూసి మీ స్పందన తెలియజేయండి` అని పేర్కొన్నారు మహేష్.