వెకేషన్ కి వేళాయెరా...ఫ్యామిలీతో మహేష్ ట్రిప్, వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

First Published Nov 8, 2020, 3:41 PM IST

దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ అందరికీ చుక్కలు చూపించింది. కరోనా వైరస్ వలన అందరూ నెలల తరబడి ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. వైరస్ ప్రభావం తగ్గినప్పటికీ కొంచెం సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. లాక్ డౌన్ మిగిల్చిన ఛేదు జ్ఞాపకాలు మరచిపోవడానికి మహేష్ ఫ్యామిలీ కూడా టూర్ కి వెళుతున్నారు. 

సూపర్ స్టార్ మహేష్ ఏమాత్రం విరామం దొరికినా ఫ్యామిలీతో విదేశీ టూర్స్ కి చెక్కేస్తారు. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ, పిల్లలు, ఫ్యామిలీకి అత్యంత ప్రాధానత్య ఇస్తారు మహేష్. ఆయన ప్రతి సినిమా ప్రారంభంలో, విడుదల తరువాత కుటుంబంతో ఖచ్చితంగా టూర్ కి వెళతారు.
undefined
సరిలేరు నీకెవ్వరు విడుదల తరువాత మహేష్ ఫ్యామిలీతో అమెరికా ట్రిప్ కి వెళ్లడం జరిగింది. ఈ ఏడాది ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్ కప్ కి కూడా మహేష్ ఫ్యామిలీతో హాజరయ్యారు. ఐతే గత ఏడు నెలలుగా మహేష్ ఇంటిలోనే గడుపుతున్నారు. కోవిడ్ ఆంక్షల కారణంగా మహేష్ ఇంటికే పరిమితం అయ్యారు.
undefined
ఈ విరామంలో మహేష్ సితార, గౌతమ్ లతో ఆదుకోవడం పాటు ఇష్టమైన పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ గడిపారు. ప్రపంచ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఫ్యామిలీతో కలిసి మహేష్ టూర్ కి వెళుతున్నారు. నేడు మహేష్, గౌతమ్, సితార మరియు నమ్రత ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇవ్వగా, కెమెరాలు క్లిక్ మనిపించారు.
undefined
మహేష్ కూడా తన ఇంస్టాగ్రామ్ లో పిల్లతో దిగిన సెల్ఫీ పోస్ట్ చేసి, తన టూర్ కన్ఫర్మ్ చేశారు. త్వరలో మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. దీనితో షూటింగ్ మొదలయ్యే లోపు పిల్లలతో అలా జాలిగా ఓ టూర్ ప్లాన్ చేశాడు మహేష్.
undefined
డిసెంబర్ లేదా జనవరి నుండి సర్కారు వారి పాట షూటింగ్ మొదలుకానుంది. దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.
undefined
click me!