ఆదిత్య ధర్ తీస్తున్న 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని ట్రేడ్ నిపుణులు నమ్ముతున్నారు. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసిందని టాక్. రణ్వీర్ సింగ్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణంతో వస్తున్న ఈ సీక్వెల్ మార్చి 2026లో విడుదల కానుంది.
మరోవైపు, నితేష్ తివారీ 'రామాయణ పార్ట్ వన్' పైనా అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రణ్బీర్ కపూర్, సన్నీ డియోల్, యశ్, సాయి పల్లవి నటిస్తున్న ఈ మైథలాజికల్ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027లో రానుంది.