Mahesh Babu, Ram Charan
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో SSMB 29 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రాజమౌళి పాన్ వరల్డ్ చిత్రంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆస్కార్ సాధించి తెలుగు సినిమా గురించి హాలీవుడ్ వాళ్ళు కూడా మాట్లాడుకునేలా చేసిన జక్కన్న ఈ సారి.. మహేష్ మూవీని హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసే ప్లానింగ్ చేస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
Mahesh Babu
రాజమౌళి ఈ చిత్రం కోసం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాని రంగంలోకి దించారు. మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. చాలా పకడ్బందీగా రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ఒక షెడ్యూల్, ఒరిస్సాలో మరో షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో మరో షెడ్యూల్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ssmb 29
ఈ కొత్త షెడ్యూల్ గురించి మైండ్ బ్లోయింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సన్నివేశంలో నీటిలో సాగే యాక్షన్ సీన్ అని తెలుస్తోంది. ఈ సీన్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ తో పాటు 3 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటారట. వందలాది బోట్స్ లో 3 వేల మందితో మహేష్ బాబు పోరాటం చేస్తాడని అంటున్నారు. ఊహించుకుంటుంటేనే ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. ఈ సీన్ ని రాజమౌళి ఎలా చిత్రీకరిస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ ఎంట్రీ సీన్ కోసం వేలమంది జూనియర్ ఆర్టిస్టులు వర్క్ చేశారు. ఆ సన్నివేశంలో రాంచరణ్ పెర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కాయి. అంతకి మించేలా మహేష్ బాబు పోరాటం 3 వేలమందితో ఉండబోతోందా అనే అంచనాలు ఆల్రెడీ మొదలయ్యాయి.
Mahesh Babu
దీనికోసం హైదరాబాద్ లో భారీ సెట్ నిర్మిస్తున్నారట. ఈ సన్నివేశంలో విజువల్ ఎఫెక్ట్స్ పాత్ర భారీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశం చిత్రీకరణ దాదాపు 30 రోజుల పైనే ఉంటుందని అంటున్నారు. అంటే SSMB 29 చిత్రంలో ఈ సన్నివేశం ఎంత కీలకం కానుందో అర్థం అవుతోంది.
ఈ సన్నివేశం కోసం మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 3 వేలమంది జూనియర్ ఆర్టిస్ట్ లు కూడా వైవిధ్యమైన గెటప్స్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.