పవర్ సోప్స్ లిమిటెడ్ కంపెనీ తన ఫోటోలను ఒప్పందం ముగిశాక కూడా వాడుకుందంటూ నటి తమన్నా భాటియా వేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలన్న ఆమె అప్పీల్ను తోసిపుచ్చింది.
2008లో పవర్ సోప్స్ ఉత్పత్తుల ప్రచారం కోసం తమన్నా ఒక ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం, అక్టోబర్ 2009 వరకు మాత్రమే ఆమె ఫోటోలను వాడుకోవాలి. కానీ, ఆ తర్వాత కూడా కంపెనీ తన ఫోటోలను వాడుకుందని తమన్నా ఆరోపించారు.
25
ఒప్పందం ముగిశాక
ఒప్పందం ముగిశాక కూడా 2010-11లో కంపెనీ తన ఫోటోలను సోప్ ర్యాపర్లు, యాడ్స్, ఆన్లైన్లో వాడుకుందని తమన్నా ఆరోపించారు. దీనివల్ల ఇతర బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు తనకు నష్టం వాటిల్లిందని ఆమె కోర్టుకు తెలిపారు.
35
తమన్నా విఫలమయ్యారని
జస్టిస్ పి. వేల్మురుగన్, జస్టిస్ కె. గోవిందరాజన్ తిలకవాడిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఒప్పందం ముగిశాక కంపెనీ తన ఫోటోలను వాడిందని నిరూపించడంలో తమన్నా విఫలమయ్యారని కోర్టు స్పష్టం చేసింది.
తమన్నా కోర్టుకు సమర్పించిన సోప్ ర్యాపర్లు, కొనుగోలు రశీదులు, ఇంటర్నెట్ లిస్టింగ్లు నమ్మదగినవిగా లేవని కోర్టు అభిప్రాయపడింది. ఆ సాక్ష్యాలకు, కంపెనీకి మధ్య బలమైన సంబంధం లేదని న్యాయమూర్తులు తేల్చిచెప్పారు.
55
కోర్టు సమయం వృథా
గతంలో సింగిల్ బెంచ్ కూడా తమన్నా వాదనలో పసలేదని తేల్చి, ఆమె పిటిషన్ను కొట్టేసింది. అంతేకాదు, కోర్టు సమయం వృథా చేసినందుకు ఫైన్ కూడా విధించింది. ఇప్పుడు డివిజన్ బెంచ్ కూడా అదే తీర్పును సమర్థించింది.