ప్రస్తుతం కృతి సనన్.. సీనియర్ హీరోయిన్లు టబు, కరీనా కపూర్ తో కలసి క్రూ అనే లేడి మల్టీస్టారర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం మార్చి 29న రిలీజ్ కి రెడీ అవుతోంది.
మెరుపు తీగలాంటి బ్యూటీ కృతి సనన్. మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశ పరచడం కృతికి మైనస్ గా మారింది.
29
ఆ తర్వాత నాగ చైతన్యకు జోడిగా నటించిన దోచేయ్ చిత్రం కూడా నిరాశపరచడంతో కృతి సనన్ బాలీవుడ్ బాట పట్టింది. ఇప్పుడు కృతి సనన్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
39
ఈ నిర్ణయం ఆమెకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. బాలీవుడ్ లో వరుస సక్సెస్ లు రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు.
49
గత ఏడాది కృతి సనన్ కి బిగ్ షాక్ తగిలింది. ప్రభాస్ కి జోడిగా నటించిన ఆదిపురుష్ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదు మరోవైపు దేశం నలువైపుల నుంచి ఆదిపురుష్ చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టాయి.
59
ఈ చిత్రంలో కృతి సనన్ సీతాదేవి పాత్రలో నటించి మెప్పించింది. ఆమె పాత్రకి సంబంధించి ఎలాంటి సమస్య లేదు. ఇతర పాత్రల్లో దర్శకుడు ఓం రౌత్ వాడిన కాస్ట్యూమ్స్ గ్రాఫిక్స్, డైలాగ్స్ పై వివాదాలు చెలరేగాయి.
69
ప్రస్తుతం కృతి సనన్.. సీనియర్ హీరోయిన్లు టబు, కరీనా కపూర్ తో కలసి క్రూ అనే లేడి మల్టీస్టారర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం మార్చి 29న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో కృతి సనన్ ప్రచార కార్యక్రమాల్లో బ్లాక్ డ్రెస్ లో మెరిసింది.
79
కృతి సనన్ ఎలాంటి క్రేజీ చిత్రంలో నటించినా ఆమెకి సక్సెస్ ఆమడ దూరంలో ఉంటోంది. చివరగా టైగర్ ష్రాఫ్ సరసన నటించిన గణపథ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
89
కృతి సనన్ కి వరుసగా భారీ చిత్రాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి కానీ విజయాలు దక్కడం లేదు. దీనితో కొత్తగా ప్రయత్నించిన క్రూ చిత్రం అయినా సక్సెస్ ఇస్తుందేమో చూడాలి.
99
వరుస పరాజయాల నేపథ్యంలో కృతి సనన్ కి సౌత్ లో అవకాశాలు వస్తాయో రావో చూడాలి. ఆదిపురుష్ చిత్రంపై కృతి చాలానే ఆశలు పెట్టుకుంది. కానీ ఆ చిత్రం నిరాశపరిచింది.