కృతి సనన్ లేటెస్ట్ ఫొటోస్.. ప్రభాస్ హీరోయిన్ లేటెస్ట్ మూవీకి క్రేజీ రెస్పాన్స్

First Published Mar 29, 2024, 3:44 PM IST

కృతి సనన్.. సీనియర్ హీరోయిన్లు టబు, కరీనా కపూర్ తో కలసి క్రూ అనే లేడి మల్టీస్టారర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది.

మెరుపు తీగలాంటి బ్యూటీ కృతి సనన్. మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశ పరచడం కృతికి మైనస్ గా మారింది.

  ఆ తర్వాత నాగ చైతన్యకు జోడిగా నటించిన దోచేయ్ చిత్రం కూడా నిరాశపరచడంతో కృతి సనన్ బాలీవుడ్ బాట పట్టింది. ఇప్పుడు కృతి సనన్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.  

ఈ నిర్ణయం ఆమెకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. బాలీవుడ్ లో వరుస సక్సెస్ లు రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. 

గత ఏడాది కృతి సనన్ కి బిగ్ షాక్ తగిలింది. ప్రభాస్ కి జోడిగా నటించిన ఆదిపురుష్ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదు మరోవైపు దేశం నలువైపుల నుంచి ఆదిపురుష్ చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. 

ఈ చిత్రంలో కృతి సనన్ సీతాదేవి పాత్రలో నటించి మెప్పించింది. ఆమె పాత్రకి సంబంధించి ఎలాంటి సమస్య లేదు. ఇతర పాత్రల్లో దర్శకుడు ఓం రౌత్ వాడిన కాస్ట్యూమ్స్ గ్రాఫిక్స్, డైలాగ్స్ పై వివాదాలు చెలరేగాయి. 

ప్రస్తుతం కృతి సనన్.. సీనియర్ హీరోయిన్లు టబు, కరీనా కపూర్ తో కలసి క్రూ అనే లేడి మల్టీస్టారర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది. కరీనా కపూర్,టబు, కృతి సనన్ ముగ్గురూ కలిసి నటించడంతో గ్లామర్ యాడ్ అయింది. అయితే ఈ చిత్ర కథ కూడా అద్భుతంగా ఉందని ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. 

కామెడీ, సస్పెన్స్, ఉత్కంఠని పెంచేసి సన్నివేశాలతో క్రూ చిత్రం ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. రాజేష్ ఏ కృష్ణన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కృతి సనన్, కరీనా కపూర్, టబు ఇండియా మొత్తం తిరిగేస్తూ ఈ చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా కృతి సనన్ పింక్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 

click me!