కెట్టవన్ సినిమా దర్శకుడు జిటి నందు, శింబు వల్లే రోడ్డున పడ్డానని ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. “కెట్టవన్ ఆగిపోయాక సింబు నుంచి శుభవార్త వస్తుందని ఎదురు చూశా. సినిమా తీస్తున్నప్పుడు నాకు పెళ్లయి, పాప పుట్టింది. అప్పుడు సింబు 50 వేలు ఇచ్చాడు. అది ఆసుపత్రి ఖర్చులకు ఉపయోగపడింది. దాన్ని నేనే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నా.