అలిమేలు మంగగా మారతానంటున్న కీర్తిసురేష్‌.. ఈ సారి టార్గెట్‌ ఏంటో?

First Published Oct 13, 2020, 7:57 PM IST

కీర్తిసురేష్‌.. సౌత్‌లో మోస్ట్ వాంటెడ్‌ హీరోయిన్‌. `మహానటి`తో దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయిపోయింది. యంగ్‌ హీరోల నుంచి అగ్ర కథానాయకుల వరకు అందరూ ఆమెనే కోరుకుంటున్నారు. 

కీర్తిసురేష్‌ కెరీర్‌ `మహానటి`కి ముందు..`మహానటి` తర్వాత అనేలా సాగింది. కెరీర్‌ ప్రారంభంలోనే ఇంతటి గుర్తింపుని తెచ్చుకోవడం విశేషం.
undefined
`మహానటి`తో ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని గెలుచుకున్న కీర్తి చేతిలో అరడజన్‌ సినిమాలున్నాయి.
undefined
తెలుగు, తమిళం, మలయాళంలో అగ్ర హీరోలతో కలిసి నటిస్తుంది.
undefined
తాజాగా తెలుగులో మరో సినిమాకి సైన్‌ చేసినట్టు తెలుస్తుంది. తేజ దర్శకత్వంలో నటించబోతున్నట్టు సమాచారం.
undefined
తేజ ప్రస్తుతం గోపీచంద్‌ హీరోగా `అలిమేలు మంగ వేంకటరమణ` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
undefined
యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో గోపీచంద్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్‌.
undefined
ఇందులో హీరోయిన్‌ పాత్రకి కీర్తిసురేష్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇందులో హీరోయిన్‌గా ఇతర ప్రముఖ కథానాయికల పేర్లు వినిపించాయి. కానీ కీర్తిని తేజ ఫైనల్‌చేసినట్టు సమాచారం.
undefined
ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో కీర్తి పాత్రకి చాలా ప్రయారిటీ ఉంటుందని టాక్.
undefined
బేసిక్‌గా తేజ సినిమాల్లో హీరోయిన్‌ పాత్రలకి మంచి ప్రాధాన్యత ఉంటుందన్న విషయం తెలిసిందే.
undefined
మరి `మహానటి`తో జాతీయ అవార్డు సాధించిన కీర్తి.. మరి ఈ సినిమాతో దేన్ని టార్గెట్‌ చేస్తుందో చూడాలి.
undefined
ప్రస్తుతం కీర్తిసురేష్‌ తెలుగులో నితిన్‌తో `రంగ్‌దే`, లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం`మిస్‌ ఇండియా`తోపాటు ఆదిపినిశెట్టితో కలిసి `గుడ్‌ లక్‌ సఖి` చిత్రాల్లో నటిస్తుంది.తమిళంలో రజనీకాంత్‌తో `అన్నత్తే`లో, అలాగే `సాని కాయిదమ్‌`లో మెరవబోతుంది. మలయాళంలో మోహన్‌లాల్‌తో `మరక్కర్‌` చిత్రంలో నటిస్తుంది.
undefined
click me!