సూర్య, త్రిష నటించిన వీరభద్రుడు (కరుప్పు) సినిమా థియేటర్లలో దుమ్మురేపుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు ఎన్ని కలెక్షన్లు వసూలు చేసిందంటే? ఈ సినిమాతో సూర్య కమ్ బ్యాక్ ఇచ్చినట్టేనా?
సౌత్ స్టార్ హీరో సూర్య నటించి, భారీ అంచనాలతో విడుదలైన సినిమా కరుప్పు (వీరభద్రుడు). ఈ సినిమాలో సూర్యకు జోడీగా త్రిష నటించింది. వీరిద్దరూ 21 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించారు. ఈ సినిమాకు ఆర్.జె.బాలాజీ దర్శకత్వం వహించారు. సాయ్ అభ్యంకర్ సంగీతం అందించగా, జికే విష్ణు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్.ఆర్.ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో అడ్డంకులను దాటుకుని ఈ సినిమా మే 15న థియేటర్లలో విడుదలైంది.
25
30 కోట్లు సాయం చేసిన సూర్య..
'కరుప్పు' సినిమాను మే 14నే విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ నిర్మాత తీసుకున్న అప్పు కారణంగా, ఫైనాన్షియర్ సినిమాకు ఎన్ఓసీ (NOC) ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో సినిమా విడుదలను ఆపేశారు. ఆ తర్వాత నటుడు సూర్యతో పాటు పలువురు చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారు. ఈ క్రమంలో సూర్య దాదాపు రూ.30 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అందుకే ఒకరోజు ఆలస్యంగా, అంటే మే 15న 'కరుప్పు' థియేటర్లలోకి వచ్చింది.
35
సూర్య వన్ మ్యాన్ షో..
'వీరభద్రుడు'(కరుప్పు) సినిమా ప్రేక్షకులకు పక్కా విందు భోజనంలా ఉంది. ఈ సినిమా సూర్యను మళ్లీ కమర్షియల్ హీరోగా నిలబెట్టింది. యాక్షన్, ఎమోషన్, కామెడీ.. ఇలా అన్నింటిలోనూ సూర్య అదరగొట్టేశాడు. అతనికి పోటీగా 'బేబీ కన్నన్' అనే విలన్ పాత్రలో ఆర్.జె.బాలాజీ నటించారు. వీళ్లతో పాటు వేల రామమూర్తి, ఇంద్రన్స్, నట్టి నటరాజ్, దీప వంటి పెద్ద తారాగణం ఉండటం సినిమాకు పెద్ద బలంగా మారింది.
వీరభద్రుడు (కరుప్పు) సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సమాచారం ప్రకారం, ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.20.66 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది విడుదలైన తమిళ సినిమాల్లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'కరుప్పు' రికార్డు సృష్టించింది. ఇదే జోరు కొనసాగితే, ఈ ఏడాది రూ.100 కోట్లు వసూలు చేసిన తొలి తమిళ చిత్రంగా నిలిచే అవకాశం ఉంది.
55
వీకెండ్ బాగా కలిసి వస్తుందా?
సాయ్ అభ్యంకర్ సంగీతం 'కరుప్పు' సినిమాకు బాగా ప్లాస్ అయ్యింది. అది చాలా సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ వీకెండ్ రెండు సెలవులు కావడంతో శని, ఆదివారాలు 'కరుప్పు' కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ వీకెండ్ ముగిసేలోపు సినిమా రూ.50 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది సూర్యకు భారీ కంబ్యాక్ కావడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.