తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో గుండెపోటుకు గురైన సినీ నటుడు తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే తారకరత్నను పరామర్శించేందుకు ఆయన సోదరులు, ప్రముఖ సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్లు ఈ రోజు బెంగళూరుకు వచ్చారు.