
కన్నడ మూవీ ని నెక్ట్స్ లెవిల్ కు ఈ మధ్యకాలంలో తీసుకెళ్లిన రెండు సినిమాలు కేజీఎఫ్, కాంతార. ఆల్రెడీ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సలార్ చిత్రం చేసారు. సలార్ 2 కు రెడీ అవుతున్నారు. ఇక ఇప్పుడు కాంతారా తో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకుని పాన్ ఇండియా స్టార్గా నిలిచిన రిషబ్ శెట్టి తో ప్రభాస్ వర్క్ చేయబోతున్నారు. ఈ కాంబో ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు. ఆ వివరాలు చూద్దాం.
రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతారకి ప్రీక్వెల్గా రూపొందుతున్న కాంతార చాప్టర్ 1 ను చేస్తున్న విషయం తెల్సిందే. కాంతారను చిన్న బడ్జెట్ లో చిన్న సినిమాగా రూపొందించి పెద్ద హిట్ కొట్టిన రిషబ్ శెట్టి పేరు ఒక్కసారిగా అంతటా మారు మ్రోగిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు నిర్మాతలు, హీరోల దృష్టి రిషబ్ శెట్టి పై పడింది.
ఈ క్రమంలో కాంతార చాప్టర్ 1ను మాత్రం భారీ బడ్జెట్ మూవీగా రూపొందిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలై రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. 2025లో కాంతార 1 విడుదల కాబోతుందని అఫీషియల్ ప్రకటన వచ్చింది. 2025 అక్టోబర్ 2న విడుదల కాబోతున్న కాంతార చాప్టర్ 1 షూటింగ్ వచ్చే ఏడాది సమ్మర్ వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో రిషబ్ శెట్టి తన నెక్ట్స్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. అందులో ఒకటి ప్రభాస్ ది కావటం విశేషం.
తెలుగులో నెంబర్ దర్శకుడు రాజమౌళి, యంగ్ డైరక్టర్స్ సుజీత్, నాగ్ అశ్విన్ లతో పనిచేసిన తర్వాత, ప్రస్తుతం ప్రభాస్, నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి చెప్పిన ఓ స్టోరీ లైన్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా రిషబ్ శెట్టి ఈ స్క్రిప్ట్పై పని చేస్తున్నారు. 'KGF' మరియు 'కాంతారా' వంటి పాన్-ఇండియా బ్లాక్బస్టర్ల వెనుక నిలబడిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అందులో భాగంగా ప్రభాస్ స్టార్ ఇమేజ్ ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లే స్క్రిప్ట్ని లాక్ చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా నటుడు , దర్శకుడు రిషబ్ శెట్టిని ఓ ఎట్రాక్టివ్ స్క్రిప్ట్ను అందించమని కోరారు. అతను ఒక స్క్రిప్ట్ అందిస్తానని హామీ ఇచ్చాడు, కానీ అతను దర్శకత్వం వహించరని తెలుస్తోంది.
రిషబ్కి హోంబలే ఫిల్మ్స్తో మంచి అనుబంధం ఉంది . "నటుడు. నిర్మాత కలిసి 'కాంతారా'తో భారీ విజయాన్ని చవిచూశారు. ఇప్పుడు దాని 'ప్రీక్వెల్'ను ప్రారంభించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువయ్యేలా భారీగా 100 కోట్లకు పైగా నిర్మించబడుతోంది.
ఈ క్రమంలో వారు ప్రభాస్ కోసం స్పెషల్ స్క్రిప్ట్ గురించి చర్చించారు. దాంతో రిషబ్ కొన్ని స్టోరీ ఐడియాలను బౌన్స్ చేసినట్లు సమాచారం. రిషబ్ చెప్పిన క్యారక్టరైజైషన్ ప్రభాస్ కు ఫెరఫెక్ట్ గా సెట్ అవుతుందని చెప్తున్నారు. ఈ స్టోరీ లైన్ విని ఆ కథలో నటించడానికి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ కథ లార్జర్ దేన్ లైఫ్ అని చెప్తున్నారు.
బాహుబలిలో యోధుడి నుండి 'సాహో'లో సూపర్కాప్గా, 'కల్కి 2898'లో బౌంటీ హంటర్గా వైవిధ్యమైన పాత్రలను పోషించిన ప్రభాస్, మరో ఛాలెంజింగ్ పాత్ర కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం, ప్రభాస్ భారీ యాక్షన్ చిత్రం 'ఫౌజీ' చేస్తున్నాడు మరియు హారర్ కామెడీ 'ది రాజా సాబ్' కూడా ఉన్నాడు.
దర్శకుడు ప్రశాంత్ నీల్తో కలిసి 'సాలార్ 2'లో కూడా పని చేయబోతున్నాడు. ప్రభాస్ డిఫరెంట్ పాత్రలకు న్యాయం చేయడానికి ప్రతిసారీ తనకు తానుగా మేకోవర్ ఇస్తున్నాడు, మార్చుకుంటూ వస్తున్నాడు.
రిషబ్ శెట్టి కెరీర్ విషయానికి వస్తే... కాంతార 1 సినిమా పూర్తి కాకుండానే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ సినిమాను రిషబ్ శెట్టి చేస్తున్నారు. హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి కనిపించబోతున్నారు. హనుమాన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీక్వెల్గా రాబోతున్న జై హనుమాన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి .
ఈ రెండు సినిమాలు కాకుండా మరో కొత్త సినిమాను రిషబ్ శెట్టి ప్రకటించారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథతో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో సినిమా రూపొందబోతుంది. ది ప్రైడ్ ఆఫ్ భారత్ : ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాతో రిషబ్ శెట్టి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను సైతం విడుదల చేశారు.