టాలీవుడ్ కు దర్శకుడు పూరి జగన్నాధ్ చాలా మంది హీరోయిన్స్ ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అందులో బాలీవుడ్ క్వీన్, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ కంగనా రనౌత్ కూడా ఉంది. పూరి – ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమాతో కంగనా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కానీ కంగనా అంతకుముందే పోకిరి సినిమాతోనే తెలుగు పరిశ్రమకు పరిచయం అవ్వాల్సి ఉందట. కాని ఆ సినిమా మిస్ అయ్యిందంటూ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ కామెంట్స్ చేసింది.