తర్వాత కిందికి వచ్చిన కావ్య అందరూ రెడీ అయి కూర్చోవడం చూసి ఎక్కడికి తాతయ్య ప్రయాణం అని అడుగుతుంది. మీ పెళ్లయినప్పుడు శ్రీశైలం వస్తానని మొక్కుకున్నాము ఇప్పటివరకు కుదరలేదు అందుకే ప్రయాణం పెట్టుకున్నాము మీకోసమే ఎదురు చూస్తున్నాము అంటారు చిట్టి దంపతులు. ఇప్పటికిప్పుడు అంటే ఎలా నాకు ఆఫీసులో చాలా పని ఉంది అంటాడు రాజ్. కనీసం నువైనా రా అని కావ్య ని పిలుస్తుంది చిట్టి.