ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు పార్టీ కార్యక్రమం లాగా జరిగినా ఎలా జరిగినా కుటుంబ సభ్యులంతా సందడి చేస్తారని అభిమానులు భావించారు. కానీ వేదికపై బాలయ్య, చంద్రబాబు తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు. ముఖ్యంగా మనవళ్లుగా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కనిపించకపోవడం ఫ్యాన్స్ కి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.