కానీ రీసెంట్ గా మద గజ రాజా ఈవెంట్ లో విశాల్ వణికిపోతూ కనీసం నడవలేని స్థితిలో కనిపించాడు. విశాల్ సన్నిహితులు అతడికి వైరల్ ఫీవర్ సోకింది అని చెప్పారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని, త్వరలో కోలుకుంటాడు అని తెలిపారు. ఖుష్బూ అయితే విశాల్ కి డెంగ్యూ ఫీవర్ వచ్చినట్లు తెలిపింది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇలా విశాల్ ఆరోగ్యం గురించి కోలీవుడ్ సెలెబ్రిటీలు వరుసగా స్పందిస్తున్నారు.