Guppedantha Manasu: కొడుకు, కోడల్ని కలపమని అడిగిన జగతి.. వసు,రిషి లకు పరీక్ష పెట్టిన జయచంద్ర?

Published : Apr 05, 2023, 07:25 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు ఏప్రిల్ 5వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Guppedantha Manasu: కొడుకు, కోడల్ని కలపమని అడిగిన జగతి.. వసు,రిషి లకు పరీక్ష పెట్టిన జయచంద్ర?

ఈ రోజు ఎపిసోడ్ లో జగతి ఈ కాలేజీ ఎండీ రిషి నా కొడుకు అన్న విషయం మీకు తెలుసు కదా సార్ అలాగే వసుధార వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఇద్దరు చాలా మంచి వాళ్ళు. ఎదుటి వ్యక్తులను బాగా అర్థం చేసుకుంటారు. కానీ ఎందుకో కలవలేక పోతున్నారు అని బాధగా మాట్లాడుతుంది జగతి. అప్పుడు వసు రిషి ల పెళ్లి ఎలా జరిగిందంటే అంటూ జరిగింది మొత్తం వివరిస్తుంది జగతి. మీరు ఎలా అయినా వారి జీవితాలను చక్క దిద్దాలి సార్ అని అంటుంది. వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి అని అంటుంది జగతి. కచ్చితంగా అమ్మ.. నీ కొడుకు చాలా గొప్పవాడు. నువ్వు చెప్పిన ప్రకారం ఇద్దరిలో ఎవరి తప్పులేదు ఎవరి దృష్టిలో వాళ్ళు చేసింది కరెక్టే అలాగే ఇద్దరు ముందుకు వెళుతున్నారు.
 

26

ఇద్దరికీ ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉంది. కచ్చితంగా వాళ్ళిద్దరూ నేను ఒక్కటి చేస్తానమ్మా అని అంటాడు జయచంద్ర. థాంక్యూ సార్ అని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోతుంది జగతి. ఆ తర్వాత జయచంద్ర తన స్పీచ్ ని మొదలుపెడతాడు. ఈరోజు మనం ఏం టాపిక్ మాట్లాడుకుందాం చెప్పండి అనగా ఇంతలోనే ఒక అబ్బాయి లేచి ఆస్కార్ అవార్డు గురించి చెప్పండి సార్ అన్నది వరకు వార్తలు అవే వార్తలు కదా ఏదైనా కొత్తగా చెప్పండి అని అంటాడు జయచంద్ర. అప్పుడు మీరే చెప్పండి సార్ అనడంతో మ్యారేజ్ గురించి మాట్లాడుకుందాం అని అంటాడు జయచంద్ర. అప్పుడు పెళ్లి గురించి పెళ్లి గొప్పతనం గురించి వివరిస్తూ ఉంటాడు జయచంద్ర. అప్పుడు జయచంద్ర మాటలకు వసుధార,రిషి ఇద్దరు కనెక్ట్ అవుతారు.
 

36

 పెళ్లంటే మీరు ఏమనుకుంటున్నారు అనగా ఏడు అడుగులు మూడు ముళ్ళు, జిలకర బెల్లం సార్ అనే స్టూడెంట్స్ చెప్పడంతో మీరు చెప్పినవన్నీ వివాహ బంధంలో ఉంటాయి. అసలు పెళ్లి అంటే రెండు మనసులు కలవడం. ధర్మేచ, కామేచ,మోక్షేచ ఇద్దరు ఒకటిగా బ్రతకడం అని అంటాడు. అప్పుడు పెళ్లిళ్లలో ఎన్ని రకాలు ఉన్నాయి. ఆ పెళ్లిళ్ల గురించి ఏంటి అనేది వివరిస్తూ ఉంటాడు జయచంద్ర. అప్పుడు రిషి,వసుధార సార్ చెప్పిన ఏ పద్ధతిలో మన పెళ్లి జరిగింది అని అడుగుతాడు. సార్ చెప్పిన ఎనిమిది రకాల వివాహాల్లో మనం చేసుకున్న వివాహం ఏ పద్ధతి అని అడుగుతాడు రిషి.  చెప్పు వసుధార ఏ రకం అని అడుగుతాడు రిషి. అప్పుడు వసుధార కోపంతో పైకి లేచి సార్ ఈ ఎనిమిది రకాలు వివాహాలే కాకుండా ఇంకొక రకం వివాహం కూడా ఉంది సార్,అది కూడా చేర్చాలి, దాని పేరే ఆపత్కాల వివాహం అని అంటుంది.
 

46

దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అనడంతో సరే అమ్మ ఒక్కసారి స్టేజ్ మీదకు వచ్చి చెప్పు అని అంటాడు జయచంద్ర. అప్పుడు వసు స్టేజ్ పైకి వెళ్లడంతో జగతి,మహేంద్ర, రిషి,టెన్షన్ పడుతూ ఉంటారు. ఆపత్కాల వివాహం అంటే ఒక ఆడపిల్ల అత్యవసర పరిస్థితులలో దిక్కుతోచని పరిస్థితులలో తన ప్రేమను బతికించుకోవడానికి తనంతట తానుగా మెడలో తాళి వేసుకోవడాన్ని ఆపత్కాల వివాహం అంటారు అని అంటుంది. దాని వెనుక ఎంత పెద్ద  కారణాలైనా ఉండవచ్చు. అటువంటి పరిస్థితులలో తన ప్రేమించిన వాడు పక్కన లేకపోయినా తనని ఊహించుకుని తానే వేసినట్టుగా మెడలో తాళి వేసుకుంటే అది వివాహమే అవుతుంది కదా అని అంటుంది.
 

56

అప్పుడు వసు మాటలకు అందరూ ఆలోచనలో పడతారు. చెప్పండి అని వసుధార అందరిని అడగడంతో నాకు ఒక చిన్న సందేహం ఉంది సార్ అని అంటాడు రిషి. అప్పుడు జగతి , మహేంద్ర టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు రిషి మీరు ఇందాక చెప్పిన ఎనిమిది రకాల వివాహాలు స్త్రీ,పురుషులు లేకుండా ఏదైనా ఒక వివాహమైన ఉందా సార్ అని అంటాడు. అందుకే సార్ నేను ఇందాక తొమ్మిదవ వివాహం అన్నాను అనగా వెంటనే రిషి ఎటువంటి వివాహమైన స్త్రీ పురుషులు ఇద్దరు ఉండాలి అని అంటాడు. ఒక పురుషుడిని ఊహించుకొని మెడలో తాళి వేసుకుంటే అది ఊహ అవుతుంది కానీ వివాహం కాదు అనడంతో వసుధార షాక్ అవుతుంది. ఒకవేళ అది వివాహం అనుకున్న కూడా దాన్ని అంగీకరించడానికి ఎవరు ముందుకు రారు అని అంటాడు రిషి.

66

అప్పుడు అందరి ముందు వసుధారని ఉద్దేశించి రిషి మాట్లాడడంతో వసుధార బాధపడుతూ ఉంటుంది. జయచంద్ర మీరిద్దరూ మీ ఆలోచనలను బట్టి మంచి విశ్లేషణను ఇచ్చారు. ఇద్దరిలో ఒకరిది మనోధర్మమైతే, ఇంకొకరిది సాంప్రదాయ ధర్మం. ఇందులో ఏ ఒక్కరిది తప్పు కాదు. ప్రస్తుత కాలంలో ఇలా గొప్పగా ఆలోచించడం చాలా గొప్ప విషయం అని అంటాడు. అప్పుడు జయచంద్ర వసుధార మాటలకు వత్తాసు పలుకుతూ వసుధారని పొగుడుతూ ఉంటాడు. తరువాత రిషి గురించి మాట్లాడుతూ ఇంత పెద్ద స్థానంలో ఉండి బాగా ఆలోచిస్తున్నాడు అంటే రిషి చాలా గ్రేట్ అని అంటాడు జయచంద్ర. ఈ విషయంలో నేను చెప్పడం కంటే మీరు చెప్పడమే కరెక్ట్ ఈ విషయంలో మీ అందరికీ నేను ఓటింగ్ పెడుతున్నాను. రిషి చెప్పింది కరెక్ట్ అయితే ఆర్ అని వసుధార చెప్పింది కరెక్ట్ అయితే వీ అనే పేపర్లో రాసి ఇవ్వాలి అని అంటాడు జయచంద్ర. ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తే వాళ్ళ అభిప్రాయము నిర్ణయం సరైన అర్థం అని అంటాడు.

click me!

Recommended Stories