Rashmi Gautam: `జబర్దస్త్` రష్మికి కోపం వచ్చింది.. ఇంత కంటే దరిద్రం ఏముంటుందంటూ ఫైర్‌.. పోస్ట్ వైరల్‌

First Published Jun 22, 2022, 7:51 PM IST

హాట్‌ హాట్‌ అందాలను వేడి వేడిగా వడ్డిస్తూ అభిమానులకు మతిపోగొట్టే యాంకర్‌ రష్మికి కోపం వచ్చింది. క్యూట్‌ నవ్వులతో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేసే రష్మి మండిపోయింది. ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 

`జబర్దస్త్` యాంకర్‌ రష్మి ఈ కామెడీ షోకి ఓ గ్లామర్‌ ఐకాన్‌. ఈ అమ్మడు అందాలు ఈ షోకి పెద్ద అసెట్. ఆమె మాటలు మరింత కట్టిపడేస్తూ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటాయి. దీనికితోడు సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అదే షోకే హైలైట్‌గా నిలుస్తుంటుంది. 
 

`జబర్దస్త్` షో కోసం ఆమె గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తూ, అందాలు ఆరబోస్తూ పంచుకునే ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతుంటాయి. నెటిజన్లని కట్టిపడేస్తుంటాయి. తరచూ ఆమె తన అభిమానుల కోసం గ్లామర్‌ షో చేస్తూ తనచుట్టూ తిప్పుకుంటుంది. 
 

ఇటీవల ఆమె `జబర్దస్త్`తోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి కూడా హోస్ట్గా చేస్తుంది. సుడిగాలిసుధీర్‌ సినిమాల్లో బిజీగా ఉండటంతో రష్మీ ఆ బాధ్యతలు తీసుకుంటుంది. ఆమె వచ్చాక ఈ షోని మరింతగా రక్తికట్టిస్తుంది. ఇందులో ఆమెపై పంచ్‌లు, ఆమె పంచ్‌లో, సడెన్‌గా ఇచ్చే షాక్‌లు హైలైట్‌గా నిలుస్తున్నాయి. 
 

రష్మి అంటూ క్యూట్‌ స్మైల్‌, పాజిటివ్‌ ఎనర్జీ, హాట్‌ అందాలు, పిచ్చెక్కించే పోజులు. ఇవే నెటిజన్లకి, ఆమె అభిమానులకు తెలుసు. కానీ ఆమెలో కోపాన్ని చూడటం చాలా అరుదు. అడపాదడపా ప్రదర్శిస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మరోసారి ఆమె కోపానికి గురైంది. ఆగ్రహంగా ఊగిపోయింది. 
 

రష్మిలో సామాజిక వేత్త కూడా ఉన్నారు. ఆమెకి జంతువులంటే ఇష్టం. వాటికి ఏమైనా తట్టుకోలేదు. మరీ ముఖ్యంగా డాగ్స్ పై అమితమైన ప్రేమని కనబరుస్తుంది. ప్రతిరోజు నిర్లక్ష్యానికి గురైన కుక్కల ఫోటోలను, హింసకి గురవుతున్న జంతువుల ఫోటోలను పంచుకుంటూ సామాజిక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటుంది. 
 

అందులో భాగంగా తాజాగా యాంకర్‌ రష్మి కోపానికి గురయ్యింది. ఓ ఫోటోని పంచుకుంటూ ఆగ్రహంతో ఓ పోస్ట్ పెట్టింది. ఇంతకంటే దరిద్రం ఏముందంటూ మండిపడుతుంది. ఇందులో ఓ అవును తాడుతో లాక్కెళ్తున్నారు. బలవంతంగా దాన్ని ఈడ్చుకెళ్తున్న వీడియోని పంచుకుంది రష్మి. 

దీన్ని ఉద్దేశించి ఆమె చెబుతూ, `ఆవును గోమాత అని పిలిచే ఇండియాలో ఇంతకంటే దరిద్రం ఉండదు. జంతు చర్మంతో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసేముందు ఒక్కసారి కూడా ఆలోచించము. అలాంటి వస్తువులకు దూరంగా ఉందాం. మీకు పాలు ఎక్కడ నుండి వస్తున్నాయో మర్చిపోకండి` అంటూ మండిపడింది. ప్రస్తుతం రష్మీ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతూ చర్చనీయాంశమైంది. 
 

మరోవైపు ఓ కుక్క తలకి వాటర్‌ బాటిల్‌ తొడిగి ఇద్దరు వ్యక్తులు దాన్ని తీసుకెళ్తుండగా, అలా చేయోద్దని ఓ పెద్దాయన వారిస్తున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోని పంచుకుంటూ తన ఆవేదన వ్యక్తంచేసింది రష్మి. ప్రస్తుతం ఈ వీడియో సైతం వైరల్‌ అవుతుంది.

click me!