శ్రీదేవి-బోనీ కపూర్‌ల లవ్‌ స్టోరీ తెలుసా?.. పెద్ద సాహసమే చేశారుగా!

First Published Feb 28, 2021, 10:08 AM IST

శ్రీదేవి పేరు ప్రస్తావన వస్తే.. కచ్చితంగా అతిలోక సుందరి అనే సంభోదించకుండా ఉండలేం. నిజంగానే ఆమె అతిలోక సుందరిగా ఓ వెలుగు వెలిగారు. ఆడియెన్స్ లో కలల రాణిగా నిలిచిపోయారు. ఆమె బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ని వివాహం చేసుకున్నారు. వీరి మ్యారేజ్‌ వెనకాల పెద్ద లవ్‌స్టోరీ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. తాజాగా అది మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.
 

అతిలోక సుందరి శ్రీదేవి దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఇండియన్‌ సినిమాని శాషించారు. స్టార్‌ హీరోలను మించిన స్టార్‌ డమ్‌తో ఓ వెలుగు వెలిగారు. కట్టిపడేసే అందం, మంత్రముద్ధుల్ని చేసే క్యూట్‌నెస్‌, అద్భుతమైన అభినయం ఆమెని తిరుగులేని సినీ రాకూమారిని చేసింది.
undefined
ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో మెస్మరైజ్‌ చేసే నటనతో ఇండియన్‌ ఆడియెన్స్ ని ఫిదా చేసింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించి అలరించిన అతిలోక సుందరి ఇప్పటికే అభిమానుల మదిలో దేవకన్యలాగానే నిలిచిపోతుంది. వారి గుండెల్లో గూడు కట్టుకునే ఉంది.
undefined
హిందీతోపాటు సౌత్‌లో పెద్ద స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన శ్రీదేవి హిందీకి చెందిన నిర్మాత బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకుంది. కమర్షియల్‌ లెక్కలు, పెద్దల ఒత్తిడితో పెళ్లి చేసుకుందనే ప్రచారం అప్పట్లో జరిగింది. పైగా హీరోయిన్లు చాలా వరకు వ్యాపారవేత్తలనే పెళ్లిళ్లు చేసుకోవడం కూడా శ్రీదేవి.. బోనీని మ్యారేజ్‌ చేసుకోవడంలో ఆశ్చర్యమనిపించలేదు.
undefined
కానీ బోనీ కపూర్‌ని శ్రీదేవి పెళ్లి చేసుకోవడం వెనకాల పెద్ద లవ్‌ స్టోరీనే ఉందట. శ్రీదేవి కోసం బోనీ కపూర్‌ పెళ్లి కాని కుర్రాడి మాదిరిగా కొన్ని రోజులపాటు తిరిగాడట. అప్పటికే ఆయనకు మ్యారేజ్‌ అయినప్పటికీ, శ్రీదేవిని ఎలాగైనా కలవాలని ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లేవాడట. తాజాగా ఈ ఆసక్తికర విషయాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.
undefined
1980టైమ్‌లో శ్రీదేవి ఫుల్‌ బిజీ హీరోయిన్‌. హిందీతోపాటు సౌత్‌ భాషలన్నింటిలోనే సినిమాలు చేస్తూ క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. అన్ని భాషల్లో స్టార్‌ హీరోలు కూడా శ్రీదేవి డేట్స్ కోసం వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభన్‌బాబు, ఇలా ఇతర భాషల అగ్ర నటులు కూడా శ్రీదేవి కాల్‌షీట్ల కోసం తమ సినిమా షూటింగ్‌లను వాయిదా వేసుకునే వారట.
undefined
అలాంటి టైమ్‌లో శ్రీదేవితో హిందీలో ఓ సినిమా చేయాలని ప్లాన్‌చేశారు బోనీ కపూర్‌. `మిస్టర్‌ ఇండియా`లో ఆమెని తీసుకోవాలనుకున్నారు. కానీ ఆమెని కలవడం అస్సలు సాధ్యమయ్యేది కాదు. ఆ సమయంలో శ్రీదేవి కాల్షీట్లు ఆమె తల్లిగారు చూసేవారు. శ్రీదేవిని కలిసే ముందు తల్లిగారిని కలవాలి.
undefined
చాలా రోజులు వారి ఇంటిముందు బోనీ కపూర్‌ చక్కర్లు కొట్టారట. కానీ శ్రీదేవిని కలిసే అవకాశం రాలేదు. ఓ రోజు ఎట్టకేలకు బోనీకి ఆ అవకాశం ఇచ్చింది శ్రీదేవి తల్లి. డైరెక్ట్ గా శ్రీదేవిని కలిశాడు బోనీ కపూర్‌. తాను తీయబోతున్న ప్రాజెక్ట్ గురించి చెప్పాడు.
undefined
ఆ సమయంలో శ్రీదేవి లక్షల్లో రెమ్యూనరేషన్‌ తీసుకుంటుంది. బోనీ సినిమాకి పది లక్షల పారితోషికం డిమాండ్‌ చేసిందట. అందుకు బోనీ కపూర్‌ ఒక లక్ష ఎక్కువే ఇస్తానని చెప్పాడు. శ్రీదేవి కాల్‌షీట్‌ దొరకాలేగానీ, డబ్బుదేముందనుకున్నాడు. బోనీ ఆఫర్‌కి ఓకే చెప్పింది శ్రీదేవి. `మిస్టర్‌ ఇండియా`కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
undefined
ఈ సినిమా టైమ్‌లో వీరిద్దరు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత కూడా ఇతర సినిమా షూటింగ్‌లకు కూడా శ్రీదేవిని చూసేందుకు బోనీ వెళ్లేవారు. `చాంద్‌ నీ` సినిమా షూటింగ్‌ స్విట్జర్లాండ్‌లో జరుగుతుండగా, అక్కడికి వెళ్లాడు బోనీ కపూర్‌. ఇలా శ్రీదేవి వెంటా తిరుగుతూనే ఉన్నాడు. అదే సమయంలో శ్రీదేవి తండ్రి చనిపోయారు. అమ్మ ఆనారోగ్యానికి గురైంది. బ్రెయిన్‌ సర్జరీ కోసం అమెరికా వెళ్లినప్పుడు ఆమెతోపాటు అమెరికా వెళ్లాడు బోనీ. ఆమె మరణించినప్పుడు పూర్తిగా కుంగిపోయారు శ్రీదేవి. ఆ టైమ్‌లో ఆమెకి అండగా నిలిచాడు. ఇలా మరింతగా దగ్గరయ్యారు.
undefined
ఇవన్నీ శ్రీదేవిలో ప్రేమని కలిగించాయి. బోనీపై ప్రేమని పెంచేశాయి. దీంతో ఆయనకు మ్యారేజ్‌ అయిన విషయం తెలిసినా పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యింది. ఎట్టకేలకు వీరిద్దరు 1996లో ఒక్కటయ్యారు.
undefined
వీరికి ఇద్దరు కూతుళ్లు జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌ ఉన్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. శ్రీదేవితో బోనీ కపూర్ `మిస్టర్ ఇండియా`, `రూప్ కీ రాణి రోరోం కా రాజా`, `మామ్` వంటి హిట్‌ సినిమాలు చేశారు. శ్రీదేవి 2018లో దుబాయ్‌లో ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి కన్నుమూసిన విషయం తెలిసిందే. కానీ ఆమె మరణం మిస్టరీగానే మిగిలిపోయింది.
undefined
click me!