చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో బాలయ్య మూవీ చేశారా.. ఆ చిత్రం ఇదేనా ?

First Published Oct 14, 2022, 1:46 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ జర్నలిస్ట్ పాత్రలో నటించారు. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రానికి ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. లూసిఫెర్ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి తన స్టైల్, యాటిట్యూడ్, నటనతో అదరగొట్టేశారు. మోహన్ రాజా చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథని మార్చారు. 

అయితే వీకెండ్ లో గాడ్ ఫాదర్ చిత్రానికి మంచి వసూళ్లు దక్కాయి. కానీ వీక్ డేస్ లో ఈ చిత్రం నెమ్మదించినట్లు ప్రచారం జరుగుతోంది. లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎలాంటి వసూళ్లు దక్కించుకుంటుందో చూడాలి. ఈ చిత్రంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ జర్నలిస్ట్ పాత్రలో నటించారు. 

తొలిసారి పూరి చిరుతో కలసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే గాడ్ ఫాదర్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పూరి జగన్నాధ్ ఆన్లైన్ లో చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలు చర్చకి వచ్చాయి. 

చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కాల్సింది. పూరి కథ కూడా రెడీ చేశారు. ఆటో జానీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అనౌన్సమెంట్ కూడా జరిగింది. కానీ సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో చిరు ఈ చిత్రాన్ని పక్కన పెట్టేశారు. ఆ సమయంలో పూరి చాలా నిరాశ చెందిన సంగతి తెలిసిందే. 

ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి ఆటోజానీ ప్రస్తావన తీసుకువచ్చారు. నా ఆటో జానీ కథ ఉందా అని చిరు అడగగా... ఆటో జానీ పక్కన పెట్టేశాను సర్.. దానికంటే మంచి కథ మీకోసం రాస్తాను అని పూరి హామీ ఇచ్చాడు. అయితే ఆటో జానీ కథ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక రూమర్ వైరల్ అవుతోంది. చిరంజీవి కత్తి చిత్రాన్ని రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాక.. పూరి జగన్నాధ్ కూడా మూవ్ ఆన్ అయ్యారు. 

ఆటోజానీ కథలో మార్పులు చేసి బాలయ్యకి వినిపించారట. ఆ కథతోనే వీరిద్దరి కాంబినేషన్ లో పైసా వసూల్ చిత్రం తెరకెక్కినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. పైసా వసూల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ ఈ మూవీలో బాలయ్య అల్ట్రా స్టైలిష్ మాస్ మ్యానరిజమ్స్ ఆకట్టుకున్నాయి. 

click me!