విజయ్ - లోకేష్ కనగరాజ్ మూవీపై ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఇదీ ‘లోకి సినిమాటిక్ యూనివర్స్’లో భాగమే?

First Published Nov 20, 2022, 4:12 PM IST

తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ మరోసారి సెట్ అయిన విషయం తెలిసిందే. ‘విజయ్67’గా రూపుదిద్దుకోబోతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
 

కోలీవుడ్ స్టార్ విజయ్ ఇలయతళపతి ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వరిసు’ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో ‘వారసుడి’గా తెరకెక్కబోతోంది. ఈ చిత్రం తర్వాత విజయ్.. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నారు. 
 

లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రెండేండ్ల కింద విజయ్ ‘మాస్టర్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. సామాజిక అంశాన్ని కథా వస్తువుగా తీసుకున్న లోకేష్ అద్భుతమైన డైరెక్షన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అదే సమయంలో ‘ఖైదీ’ని కూడా థియేటర్లలోకి తీసుకొచ్చారు. 
 

ఈ రెండు చిత్రాల తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన భారీ చిత్రం ‘విక్రమ్’(Vikram). తమిళంతో పాటు.. తెలుగు, హిందీలోనూ భారీ సక్సెస్ ను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాతో ‘ఖైదీ’కి లింక్ పెడుతూ ‘లోకి సినిమాటిక్ యూనివర్స్’ ను పరిచయం చేశారు. 
 

ఢిల్లీ, రోలెక్స్, విక్రమ్ పాత్రలతో మరోపార్ట్ తెరకెక్కించనున్నటూ అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే.. లోకేష్ నెక్ట్స్ చిత్రం ‘విజయ్ 67’పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా కూడా ‘లోకీ సినిమాటిక్ యూనివర్స్’లో భాగమేనని అంటున్నారు. ఇదే విషయాన్ని యాక్టర్ నరైన్ కూడా తాజాగా కన్ఫమ్ చేశారు. 
 

విజయ్ 67లో లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఎంట్రీ కూడా ఉంటుందని అంటున్నారు. ఇంతకీ ఈ చిత్రాన్ని లోకీ యూనివర్స్ లోని ‘ఖైదీ’,‘విక్రమ్’ చిత్రాలకు ఎలా లింక్ కలుపుతారోనన్నదని ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కానుండగా.. ‘వరిసు’ షూటింగ్ కంప్లీట్ అయ్యాక సెట్స్ పైకి వెళ్లనుంది.
 

ఖైదీ, విక్రమ్ తో లోకేష్ కనగరాజ్ రాజ్ భారతదేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న దర్శకులలో ఒకరిగా చేరిపోయారు. దీంతో ఆయనతో కలిసి పనిచేసేందుకు స్టార్ హీరోలు కూడా ఉత్సాహం కనబరుస్తున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా అభిమానులు కూడా తదుపరి చిత్రాలకోసం ఎదురుచూస్తున్నారు. 

click me!