అందులో హీరో శివాజీ, సీరియల్స్ ఫేమ్ శోభా శెట్టి, ప్రియాంక, అమర్ దీప్, అర్జున్ వంటి నోటెడ్ ఆర్టిస్టులున్నారు. అలాగే పల్లవి ప్రశాంత్ రెండు మూడు వారాల్లోనే పాపులర్ అయిపోయాడు చివరికి టైటిల్ విన్నర్గా నిలిచారు. అయితే చాలా వరకు ఏడో సీజన్లో హీరో, పాపులర్ సెలబ్రిటీ అయిన శివాజీ విన్నర్ అవుతాడని అంతా అనుకున్నారు.
ఆయన్ని విన్నర్ చేస్తామనే హామీతోనే బిగ్ బాస్లోకి తీసుకొచ్చారనే ప్రచారం జరిగింది. చేయికి గాయమైనా, పెయిన్తో ఉన్నా ఆయన హౌజ్లో ఉండటం, ఆయనకు నాగ్ సైతం సపోర్ట్ గా నిలవడంతో విన్నర్ శివాజీనే అనుకున్నారు. కానీ ఫైనల్ లో పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.