ఈ షోకి శ్రీముఖి యాంకర్గా వ్యవహరిస్తుండగా, అనసూయ లేడీస్ టీమ్కి లీడర్గా, జడ్జ్ గా, శేఖర్ మాస్టర్ బాయ్స్ టీమ్కి లీడర్గా, జడ్జ్ గా వ్యవహరించబోతున్నారు. ఇక ఇందులో బాయ్స్ నుంచి అర్జున్,అమర్ దీప్, నిఖిల్, శ్రీకర్, గౌతమ్ టేస్టీ తేజ, యాదమ్మ రాజు, చైతూ, కిరణ్ గౌడ్ పాల్గొంటున్నారు. అలాగే అమ్మాయిల టీమ్ నుంచి ప్రియాంక జైన్, శోభా శెట్టి, విష్ణు ప్రియా, సౌమ్యారావు, దీపికా, ఆయేషా ఖాన్, ప్రేరణ, గోమతి, పల్లవి గౌడ, రీతూ చౌదరి వంటి వారున్నారు. బాయ్స్ టీమ్, లేడీ టీమ్ ల మధ్య గేమ్ జరగనుంది. సవాళ్లతో కూడి గేమ్ కావడం విశేషం.