ఇళయరాజా మ్యాజిక్.. రజినీ, కమల్‌ సినిమాలకు ఒకే ట్యూన్‌తో పాటలు.. రెండూ బంపర్‌ హిట్‌

Published : Aug 22, 2025, 05:24 PM IST

మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా ఒకే ట్యూన్‌తో రజినీకాంత్, కమల్ హాసన్ సినిమాలకు రెండు సూపర్ హిట్ పాటలు ఇచ్చారు. ఆ సినిమాలేంటి?  పాట ఏంటో తెలుసుకుందాం. 

PREV
14
ఇళయరాజా మ్యూజికల్‌ మ్యాజిక్‌

సంగీత దిగ్గజం ఇళయరాజా వెయ్యికి పైగా సినిమాలకు సంగీతం అందించారు. ఆయన పాటలకు అభిమానులుగా మారని వారుండరు. ఇప్పటి సినిమాల్లో కూడా ఆయన పాటలు వాడుతున్నారు. అంతగా ప్రజల మనసుల్లో ఆయన పాటలు నిలిచిపోయాయి. ఆ పాటల ప్రవాహంలో ఇళయరాజా రెండు సినిమాల్లో ఒకే పాట ట్యూన్‌ని ఉపయోగించారు. 

DID YOU KNOW ?
`కూలీ` చిత్రంతో రచ్చ చేసిన రజనీ
రజనీకాంత్‌ ఇటీవల `కూలీ` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీకి నెగటివ్‌ టాక్‌ వచ్చినా నాలుగు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టడం విశేషం.
24
రజనీకాంత్‌, కమల్‌ పాటలకు ఒకే ట్యూన్‌

ఇళయరాజా ఎక్కువ సినిమాలకు సంగీతం అందించిన హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్. వారి సినిమాల విజయంలో ఇళయరాజా సంగీతం కీలక పాత్ర పోషించింది. రజినీ, కమల్‌లకు ఎన్నో హిట్ పాటలు ఇచ్చిన ఇళయరాజా, వారిద్దరి సినిమాల్లోనూ ఒకే ట్యూన్‌తో రెండు పాటలు కంపోజ్ చేశారంటే నమ్మగలరా? ఆశ్చర్యం ఏంటంటే ఆ రెండు పాటలూ ప్రజలకు బాగా నచ్చాయి. విశేష ఆదరణ పొందాయి. శ్రోతలను అలరించాయి. 

34
`వసంత కోకిల`లోని యేసుదాసు పాడిన పాట

బాలు మహేంద్ర దర్శకత్వంలో కమల్ హాసన్, శ్రీదేవి నటించిన `మూడ్రాం పిరై`(తెలుగులో వసంతకోకిల) సినిమాలోని పాటలు  బాగా హిట్ అయ్యాయి. సినిమా విజయంలో ఈ సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి. కన్నదాసన్ రాసిన, యేసుదాస్ పాడిన 'Poongaatru Puthithaanathu` పాటలోని ఇంటర్లూడ్‌లో ఒక ట్యూన్ ఉంటుంది. ఆ ట్యూన్‌నే రజినీకాంత్ సినిమాలో కూడా వాడారు ఇళయరాజా.

44
రజనీకాంత్‌ `తంబిక్కు ఎంత ఊరు`లో పాత ట్యూన్‌

1984లో వచ్చిన `తంబిక్కు ఎంత ఊరు` సినిమాలో ఎస్పీ బాలు పాడిన 'ఎన్ వాళ్విలే' పాటలో ఆ ట్యూన్‌నే వాడారు. ఆ రెండు పాటలూ ఎప్పటికీ గుర్తుండిపోయే మాస్టర్ పీస్ గా నిలిచింది. తమిళ ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. `తంబిక్కు ఎంత ఊరు` సినిమాలోని 'కాదలిన్ దీపం ఒండ్రు' పాటలోని లిరిక్స్‌ని కమల్ హాసన్ `కళ్యాణ రామన్` సినిమాలో కూడా వాడారు. ఈ రెండు పాటలూ హిట్ అయ్యాయి. అది ఇళయరాజా మ్యాజిక్‌ అంటే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories