రాజకీయాలతో రగిలిపోతున్న రోజా అంటూ ఆది పొలిటికల్ సెటైర్... వేదిక కావడంతో పళ్ళు కొరుక్కుంటూ..!

First Published Feb 5, 2021, 1:33 PM IST

జబర్ధస్త్ వేదిక ద్వారా స్టార్ కమెడియన్ గా ఎదిగిన హైపర్ ఆది పంచ్ ల పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమకాలీన విషయాలపై ఆది వేసే పంచ్ లు చాలా ఫేమస్. అలాగే ఆయన తన టీం మేట్స్ తో పాటు, యాంకర్స్, జడ్జ్ లను కూడా టార్గెట్ చేసిన సందర్భాలు అనేకం అని చెప్పాలి. 

ఇక జబర్ధస్త్ జడ్జ్ గా ఏళ్ల తరబడి కొనసాగుతున్న రోజాపై ఆది అనేకమార్లు పంచ్ లు వేయడం జరిగింది.  తాజా ఎపిసోడ్ లో రోజాపై మరోమారు తన మార్క్ సెటైర్ వేశాడు ఆది.
undefined
ఈవారం రజినీకాంత్ రోబో మూవీ స్పూఫ్ చేసిన హైపర్ ఆది సైంటిస్ట్ గెటప్ వేశాడు.  సైంటిస్ట్ గా అందరూ పడి పడి నవ్వడానికి ఓ టాబ్లెట్ కనిపెట్టానని, అది వేసుకుంటే నిద్రలోకి జారుకుని పడి పడి నవ్వుతారని అన్నాడు.
undefined
మామూలుగా నవ్వించలేమా అని తోటి కంటెస్టెంట్ అడుగగా... జడ్జిలను ఉద్దేశిస్తూ, మను గారు చెన్నై నుండి వచ్చే సరికి అలిసిపోతున్నారని,  రోజా గారు రాజకీయాలతో రగిలిపోతున్నారు. వాళ్లకు మనం వేసే జోక్స్ ఏమి నవ్వు తెప్పిస్తాయని అన్నాడు.
undefined
రోజా పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నేపథ్యంలో హైపర్ ఆది సెటైర్ ఆసక్తిగా మారింది. ఆది తనపై వేసిన పంచ్ కి రోజా ఒకింత అసహనానికి గురైనా,  కామెడీ షో కాబట్టి నవ్వక తప్పలేదు.
undefined
ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు జరుగుతుండగా.. అధికారిక విపక్షాల మధ్య వాడివేడిగా మాటల యుద్ధం నడుస్తుంది. హైపర్ ఆది పంచ్ కూడా దీనిని ఉద్దేశించే కావచ్చు అనిపిస్తుంది.
undefined
ఏది ఏమైనా హైపర్ ఆది పంచ్ ని లైట్ గా తీసుకున్న రోజా.. వేదికపై మాత్రం నవ్వినట్లే కనిపించారు.
undefined
పవన్ వీరాభిమాని అయిన హైపర్ ఆది, జనసేన సానుభూతి పరుడన్న సంగతి తెలిసిందే.
undefined
click me!