Niharika Konidela:మెగా డాటర్ నిహారికకి హైపర్ ఆది మాస్ కౌంటర్.. చిరు బర్త్ డే సెలెబ్రేషన్స్ లో గొడవ

First Published Aug 15, 2022, 5:10 PM IST

హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ తమ భుజాలపై శ్రీదేవి డ్రామా కంపెనీ షోని నడిపిస్తున్నారనే చెప్పాలి. వాళ్ళిద్దరి కామెడీ పంచ్ లే హైలైట్ అవుతున్నాయి. తాజాగా ఆగష్టు 21న ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు.

యాంకర్ రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, బులెట్ భాస్కర్ కలిసి పెర్ఫామ్ చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో బుల్లితెరపై దూసుకుపోతోంది. ఈ షోకి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి అథితిగా హాజరవుతున్నారు. హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ తమ భుజాలపై శ్రీదేవి డ్రామా కంపెనీ షోని నడిపిస్తున్నారనే చెప్పాలి. వాళ్ళిద్దరి కామెడీ పంచ్ లే హైలైట్ అవుతున్నాయి. 

తాజాగా ఆగష్టు 21న ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ కి మెగా డాటర్ నిహారిక ప్రత్యేక అతిథిగా హాజరైంది. ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఉన్నాయి. దీనితో శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో చిరు బర్త్ డేని సెలబ్రేట్ చేశారు. 

బర్త్ డే సెలెబ్రేషన్స్ లో పాల్గొనేందుకు నిహారిక హాజరైంది. హైపర్ ఆదితో కలసి ఓ స్కిట్ కూడా చేసింది. ప్రోమో చూస్తుంటే వీరిద్దరూ బాగా నవ్వించినట్లు ఉన్నారు. స్కిట్ లో భాగంగా నేను హీరో కావాలని అనుకుంటున్నా అని హైపర్ ఆది అంటాడు. నేను కూడా పాన్ ఇండియా స్టార్ కావాలని అనుకుంటున్నా అంటూ నిహారిక కౌంటర్ ఇస్తుంది. 

భీమ్లా నాయక్ లో ఒక సాంగ్ చేశా అదిరిపోయింది అని హైపర్ ఆది గొప్పలు చెప్పుకుంటాడు. ఏంటి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినందుకు కూడా అంత చెప్పుకుంటున్నావ్ అని నిహారిక అంటుంది. నువ్వు సైరాలో చేసినదానికంటే నాది కొంచెం పెద్దదే లే అని హైపర్ ఆది నిహారికకి మాస్ కౌంటర్ ఇస్తాడు. 

టివి సీరియల్ నటితో హైపర్ ఆది ఖుషి నడుము సన్నివేశాన్ని రీక్రియేట్ చేస్తాడు. అది కూడా మంచి ఎంటర్టైనింగ్ గా ఉంది. హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ కలసి చేసిన స్కిట్ కూడా నవ్వులు పూయించే విధంగా ఉన్నట్లు ఉంది. 

చివర్లో శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్ మొత్తం కలసి చిరంజీవి బర్త్ డేని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ ఎపిసోడ్ ఆగష్టు 21న ప్రసారం కానుంది. చాలా రోజుల తర్వాత మెగా డాటర్ నిహారిక బుల్లితెరపై కనిపించడం ఆసక్తిగా మారింది. 

click me!