యాంకర్ రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, బులెట్ భాస్కర్ కలిసి పెర్ఫామ్ చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో బుల్లితెరపై దూసుకుపోతోంది. ఈ షోకి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి అథితిగా హాజరవుతున్నారు. హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ తమ భుజాలపై శ్రీదేవి డ్రామా కంపెనీ షోని నడిపిస్తున్నారనే చెప్పాలి. వాళ్ళిద్దరి కామెడీ పంచ్ లే హైలైట్ అవుతున్నాయి.