`శ్రీదేవి డ్రామా కంపెనీ`లో ఆది, భాస్కర్, వర్ష, ఇమ్మాన్యుయెల్, రష్మి, ప్రవీణ్, రాకేష్ వంటి మెయిన్ జబర్దస్త్ కమెడియన్లంతా కలిసి పలు సినిమాల్లోని సీన్ల స్ఫూప్తో ఓ స్కిట్ని ప్లాన్ చేశారు. అందులో భాగంగా.. `లక్ష్మీ నరసింహా` సినిమాలోని బాలయ్య డైలాగ్లో ఎంట్రీ ఇచ్చాడు హైపర్ ఆది. `వచ్చిన మొగుళ్లు వచ్చినట్టే పెళ్లాల చేతుల్లో బలవుతుంటే.. ఈ సారి వచ్చే మొగుడు బలయ్యే వాడు కాదు, బలిచ్చేవాడు వచ్చాడురా.. హైపర్ ఆది` అంటూ తొడకొట్టి మరీ చెప్పాడు ఆది. దీంతో స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయింది.